DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాహుల్ నోటి దురుసుతనమే ఈ ఫలితం: ఎంపీ మనీష్ తివారి 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 25, 2023 (DNS Online ):* నోటి దురుసుతనమే, మొండివైఖరి రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానాన్ని కోల్పోయేదాకా తెచుకున్నాడని, బీజేపీ ఎంపీ మనీష్ తివారి తెలిపారు. శనివారం విశాఖ వచ్చిన అయన విలేకరుల  సమావేశంలో మాట్లాడుతూ 2019 లో కర్ణాటక లోని కోలార్ వాహహా ఎన్నికల ప్రచారం ర్యాలీ లో చేసిన

నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయంటూ.. విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్నారు. 

ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ, సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రాహుల్‌ పై పరువు నష్టం దావా

వేశారన్నారు. నాటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూనే ఉందన్నారు.  
ఈ కేసుకుగానూ స్టేట్‌మెంట్‌ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్‌ గాంధీ సూరత్‌ కోర్టులో హాజరయ్యారన్నారు. అయితే దీనిపై క్షమాపణ కోరామని  అడిగినప్పడికి ససేమిరా అనడంతో ఈ తీర్పు వెలువడిందన్నారు. 

ఇప్పడికైనా కాలయాపన చెయ్యకుండా

ఓబిసి సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలన్నారు. నాలుగేళ్ళ కాలం పాటు సుదీర్ఘ విచారణ అనంతరమే ఈ తీర్పు విడుదల అయ్యిందన్నారు. అంతే తప్ప రాత్రి కి రాత్రి వచ్చిన తీర్పు కాదన్నారు. ఎంపీ సభ్యత్వం నిర్ణయం లోక్ సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయం అన్నారు.  

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాజ్య సభ ఎంపీ జి వి ఎల్

నర్సింహారావు, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు పి విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam