DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ అభివృద్ధి కి ప్రధాని కల్పించిన మహత్తర అవకాశం జి 20 సదస్సు 

*రాష్ట్ర ప్రభుత్వానికి ఒక జాక్ పాటు లాంటి ఆఫర్ జి 20 సదస్సు.*  

*60 దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధుల రాకతో విశాఖ ఉక్కిరిబిక్కిరి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 27  2023 (DNS Online ):* విశాఖపట్నం వేదికగా ఈనెల 28, 29 తేదీల్లో జరుగుతున్న జి 20 సదస్సు విశాఖ ప్రాంత అభివృద్ధి కి మహత్తర అవకాశం గా

మారనుంది. ఈ సదస్సు కోసం భారత  ప్రధాని నరేంద్ర మోడీ ఏరికోరి ఎంపిక చేసిన నగరం విశాఖపట్నం. 

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కి తన సంపూర్ణ సహకారం అందిస్తాను అంటూ ప్రధాని ఇచ్చిన హామీ నేడు సాకారం కాబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జి 20 సభ్యుల దేశాలతో పాటు ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులు సైతం సుమారు 55  నుంచి 60

దేశాలకు చెందిన అత్యున్నత అధికారులు హాజరవుతున్నారు.  వీళ్ళందరూ కేవలం ప్రధాని మోడీ ఇచ్చిన ఆహ్వానం మేరకు హాజరవుతున్నారు. 

ఈ జి 20 సభ్యులు ప్రపంచ GDPలో 85%, ప్రపంచ వాణిజ్యంలో 75% మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ కూటమి కి అధ్యక్షత వహిస్తున్న దేశం ఒక సంవత్సరం పాటు

దేశ వ్యాప్తంగా వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహిస్తుంది. ఫైనాన్స్ ట్రాక్ మరియు షెర్పా ట్రాక్. ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఫైనాన్స్ ట్రాక్‌కు నాయకత్వం వహిస్తుండగా, ఫైనాన్స్ ట్రాక్ తర్వాత షెర్పాలు షెర్పా ట్రాక్‌కు నాయకత్వం వహిస్తారు.

విశాఖ పట్నం లో జరుగుతున్న సదస్సులో. .

ప్రస్తుతం విశాఖ పట్నం లో జరుగుతున్నా జి 20 సదస్సు ఫైనాన్స్ ట్రాక్ లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) మౌలిక సదుపాయా ల యొక్క వివిధ అంశాలపై చర్చిస్తుంది.  అసెట్ క్లాస్‌గా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో సహా పెట్టుబడులు; నాణ్యతను ప్రోత్సహించడం, మౌలిక  సదుపాయాల పెట్టుబడి; ఇన్ఫ్రాటెక్; మరియు

వినూత్న సాధనాలను గుర్తించడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి కోసం ఆర్థిక వనరులను సమీకరించడం జరుగుతుంది.   వర్కింగ్ గ్రూప్ ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్‌లచే కోచైర్‌గా ఉంది.
 
రెండు రోజుల సుదీర్ఘ సమావేశాల అనంతరం పాల్గొన్న దేశాల ప్రతినిధులు తమ కార్యాచరణను వివరించడం జరుగుతుంది. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వ

ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయము చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు వివరించగలిగితే విదేశీ పెట్టుబడులు కేంద్రం dwaraa ఆంధ్ర ప్రదేశ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక జాక్ పాటు లాంటి అవకాశం.     

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ సదస్సు ఘనత  పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

కె చెందుతుంది. అయితే ఈ jaak పాటు ఆఫర్ ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam