DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ ఇచ్చిన బంపర్ ను ప్రచారం చేసుకోడంలో ఏపీ బీజేపీ విఫలం

*జి 20 సదస్సు ప్రాధాన్యత గురించి ఆంధ్ర నేతలకు అవగాహనా లేదా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 27  2023 (DNS Online ):* భారత ప్రధాని నరేంద్ర మోడీ జి 20 సదస్సు రూపంలో విశాఖపట్నంకు ఒక బహుమానం ఇస్తే దాన్ని ప్రచారం చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలం చెందింది. ప్రధానమంత్రి ఈ సదస్సు ని ఏరికోరి

విశాఖపట్నం లోనే నిర్వహించాలి అని మొట్టమొదటగా ప్రకటించింది వారే. ఈ విషయం జనవరి మొదటి వారం, 2023 లో కేంద్రమంత్రి మురళీధరన్ విశాఖలోనే ప్రకటించారు. అయినప్పడికి విశాఖ బీజేపీ నేతల్లో గానీ,  ఆంధ్ర బీజేపీ నేతల్లో గానీ, రాష్ట్ర కమిటీ లో గానీ ఏమాత్రం చలనం లేదు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఎంతవుందో తెలుస్తోంది.  

ఇంత

ప్రాధాన్యత ఉన్న సదస్సు గురించి రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడక పోవడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజలు బీజేపీని దోషి గా చిత్రీకరిస్తున్న తరుణంలో ప్రధాని ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని బీజేపీ నేతలు చేచేతులా తుంగలోకి తొక్కారు. అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ ను అధికార పార్టీ పూర్తిగా సద్వినియోగం

చేసుకుంది. ఈ సదస్సు ఘనత మొత్తం వైఎస్సార్  కాంగ్రెస్  పార్టీ ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. 

జి 20 సదస్సులో పాల్గొనేందుకు 60 దేశాలకు చెందిన ఉన్నత అధికారులు, మంత్రులు విశాఖ నగరానికి వచ్చి, ఇక్కడ ప్రాంతానికి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంది. 

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం

కేంద్ర  ప్రభుత్వం ఇస్తున్న నిధులు, ప్రాజెక్ట్ లతో పాటుగా, మౌలిక వసతులపై 60 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులతో అంతర్జాతీయ సదస్సు విశాఖపట్నంలో నిర్వహిస్తుంటే దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుని బీజేపీ ఖాతాలో వేసుకోవడంతో ఘోరంగా విఫలం చెందింది. 
 
ఇంత భారీస్థాయి సదస్సు ప్రాధాన్యత తెలుసుకోలేని స్థితిలో

ఆంధ్ర ప్రదేశ్  బీజేపీ నాయకులూ ఉన్నారు. 
గతంలో బీజేపీ పేరు చెప్పగానే దేశంలోనే అత్యంత మేధావులు, విద్యావంతులు నాయకత్వం వహించే  పార్టీ గా పేరు ఖ్యాతిగాంచింది. 

విశాఖపట్నం వేదికగా ఈనెల 28, 29 తేదీల్లో జరుగుతున్న జి 20 సదస్సు విశాఖ ప్రాంత అభివృద్ధి కి మహత్తర అవకాశం గా మారనుంది. ఈ సదస్సు కోసం భారత  ప్రధాని

నరేంద్ర మోడీ ఏరికోరి ఎంపిక చేసిన నగరం  విశాఖపట్నం. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల్లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు పై పూర్తి వివాదాలు వచ్చిన  నేపథ్యంలో జి 20 సదస్సు అత్యంత విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ విజయం మొత్తం కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి చెందినప్పడికి ఫలితం మాత్రం వైఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీ  ఖాతాలోకి వెళ్ళిపోతుయింది. ఈ  విషయం కూడా తెలుసుకోలేని స్థితి లో ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉంది అంటే. . ఆ పార్టీ నేతలకు పార్టీ ఎదుగుదల, అభివృద్ధి పై ఎంత శ్రద్ధ, భాద్యత ఉందొ తెలుస్తోంది.

పైగా ఈ జి 20 సదస్సు జరిగే వేదిక విశాఖపట్నం బీజేపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే  ఉండడం గమనార్హం.

 

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కి తన సంపూర్ణ సహకారం అందిస్తాను అంటూ ప్రధాని ఇచ్చిన హామీ నేడు సాకారం కాబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జి 20 సభ్యుల దేశాలతో పాటు ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులు సైతం సుమారు 55  నుంచి 60 దేశాలకు చెందిన అత్యున్నత అధికారులు హాజరవుతున్నారు.  వీళ్ళందరూ కేవలం ప్రధాని మోడీ

ఇచ్చిన ఆహ్వానం మేరకు హాజరవుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam