DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకాభిరామునికి విశాఖ లో వాడవాడలా వైభవంగా కళ్యాణం

*కోదండ రామాలయం కళ్యాణంలో పాల్గొన్న మేయర్ దంపతులు* 

*DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार*   

విశాఖ పట్నం, మార్చి 30, 2023 ( డి ఎన్ ఎస్) : శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని లోకాభి రామునికి వాడ వాడలా శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా విశాఖ నగరం లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్

అవుట్ గేట్ సమీపంలోని కోదండ రామాలయం లో గురువారం  శ్రీ సీతా రామ కళ్యాణం వైభవం గా నిర్వహించారు. విశాఖ మహా నగర ప్రధమ పౌరురాలు ( మేయర్)  గోలగాని హరి వెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి మిత్రులయ్యారు.  ముందుగా వినాయక పూజ తో ఆరంభం చేసి, సీత రామ కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పేద సంఖ్యలో పాల్గొన్న భక్తుల సందోహం మధ్య అర్చకులు కళ్యాణ ఘట్టం చేపట్టారు. 
ఈ నెల 22 శోభాకృత్ నామ సంవత్సర యుగాది వేడుకల నుంచి ధ్వజారోహణ జరిపి, శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పుణ్యాహవచనం, లక్ష్మి గణపతి హోమం, సహస్ర దీపాలంకరణ సేవ, అన్న అభిషేకం, సుదర్శన హోమం, పంచామృత అభిషేకం, అష్ట దళ పాదపద్మారాధన,

నిర్వహించారు. శుక్రవారం మహిళా భక్తులచే భారీ ఎత్తున సారె సమర్పణ చేయనున్నారు. ఉత్సవాల్లో భావంగా శ్రీ సీతారామ పట్టాభిషేకం అనంతరం ధ్వజ అవరోహణ జరుగనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు యువతీ యువకులు అధికంగా పాల్గొనడం గమనార్హం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam