DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయనేతల భాష ద్వేషం, కక్షపూరితంగా తయారైంది: ఉండవల్లి 

  *రాజమండ్రి పుస్తకావిష్కరణ సభ లో మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు*

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, ఏప్రిల్ 02, 2023 (DNS Online ):* ప్రస్తుత రాజకీయ పార్టీల్లోని ప్రజా ప్రతినిధులు,  నాయకులు మాట్లాడే భాష లో పూర్తిగా ద్వేషం తోనూ, కక్ష పూరితంగాను తయారయ్యిందని  రాజమహేంద్రవరం మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ కుమార్

ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివారం రాత్రి రాజమహేంద్ర వరం లో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సీనియర్ పాత్రికీయులు చేసిన వార్తా సంకలన ఆవిష్కరణ సభలో విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారని, వాళ్ళతో విబేధాలు మాత్రమే ఉండాలి తప్ప,

వ్యక్తిగత కక్షలు ఉండకూడదన్నారు. నేరుగా చట్టసభల్లోనే అసభ్య పదజాలం వాడుతున్నారని ఇలాంటి దారుణ విధానానికి ఎవరో ఒకరు అడ్డుకట్ట వేయాలి అని పిలుపు నిచ్చారు.

ఒక సీనియర్ పాత్రికీయులు వ్రాసిన మనలో మాట సంకలన పుస్తకాన్నీ సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మి నారాయణ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభలో ఆంధ్ర జ్యోతి సంపాదకులు కే.

శ్రీనివాస్, జాతీయ పాత్రికీయ సంఘం జాతీయ కార్యదర్శి, పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam