DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర శ్రేయస్సే కోసమే హస్తిలో భేటీలు, ఢిల్లీ లో పవన్ వెల్లడి 

*వైసీపీ విముక్త ఏపీ కోసమే బీజేపీ పెద్దలతో చర్చలు: జనసేనాని*   

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

విశాఖపట్నం /ఢిల్లీ, ఏప్రిల్ 04,  2023 (డిఎన్ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా... పలు కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం ఆహ్వానం మేరకు ఢిల్లీ కి వచ్చినట్టు జనసేన

అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెద్దలతో సమావేశం కావడం జరిగిందన్నారు.  రెండు రోజుల ఢిల్లీ పర్యటన మంగళవారం రాత్రి ముగిసింది. అనంతరం సమావేశ వివరాలను మీడియా కు వివరించారు. సోమ, మంగళ వారాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో కీలక

భేటీలు సాగాయి. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాల సాగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తో పాటు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు, రోడ్ మ్యాప్ తదితర అంశాలు సమయం వచ్చినప్పుడు తెలియచేస్తాం అన్నారు.  స్థానికంగా

క్షేత్ర స్థాయి లో రెండు పార్టీలు మరింతగా బలోపేతం అయ్యేందుకు కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాలన సంబంధితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని, అవినీతి తదితర విషయాలను కేంద్ర నాయకత్వం

దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ పాలన నుంచి విముక్తం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు చేశారు. లోతుగా ఈ చర్చలు చేశారు. ఈ రెండు రోజులపాటు సాగిన చర్చల సత్ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుతాయి అని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమ, మంగళవారాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ

మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి శ్రీ వి.మురళీధరన్ గారితో రెండు దఫాలు చర్చలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రకాష్ జీతో కూడా చర్చలో పాల్గొన్నారు. 
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వానికి తెలియచేశారు. ఇందులో భాగంగా కేంద్ర జల్

శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసి, ఈ ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని షెకావత్ దృష్టికి తీసుకువెళ్లారు.

అదే విధంగా జనసేన పై జరుగుతున్నా దాడులు, అక్రమ కేసుల నేపథ్యంలో

క్యాడర్ కు మనో ధైర్యాన్ని కల్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam