DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ@ 44. . భారత్ అంతటా బంపర్ మెజారిటీ.. ఏపీలో బ్రతికి బట్టకట్టేనా

*అందరికి మోడీ కావాలి.. అయితే ఏపీలో బీజేపీ మాత్రం వద్దు.*

*ఆంధ్ర లో 44 ఏళ్ళ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వైభవం పై కథనం.* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 06, 2023 (డిఎన్ఎస్ ):* భారత దేశమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం చతికిలపడి

చేతులెత్తేసింది. గత 43 ఏళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల్లో, మధ్య భారత్ లోను విస్తృతంగా పట్టు సాధించిన పార్టీ దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. దక్షిణాది లో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ తన హవా చాటిచెప్పింది. తమిళనాడు లో కూడా ప్రస్తుతం విశ్రాంత ఐపీఎస్ అధికారి కె. అన్నామలై

 రూపంలో ఆశాదీపం వెలిగింది. అన్ని ప్రాంతాల్లో పురోగతి సాధిస్తున్న బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిగా చతికిలపడిపోయింది.

దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక లో అధికారంలోకి వచ్చి, సంచలనం సృష్టించింది. తెలంగాణాలో పటిష్టమైన ప్రతిపక్ష హోదాలో తీవ్రమైన పోరాటం చేస్తోంది. అధికార పార్టీకి నిద్రపట్టని స్థాయిలో

తీవ్రమైన పోరాటాలే జరుగుతున్నాయి. 

అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెంకయ్య నాయుడు, హరిబాబు, జివిఎల్ నర్సింహారావు, రామ్ మాధవ్, పివిఎన్ మాధవ్, విష్ణు కుమార్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి, దేశంలోని అత్యుత్తమ నాయకులని అందించిన ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీజేపీ కనీసం గ్రామా స్థాయి ఎన్నికల్లో సైతం డిపాజిట్ లు సైతం

రాబట్టుకోలేని గతి ఉంది. 

దేశ విదేశాల్లో అద్భుతమైన పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రధానిగానే ఉండాలంటూ అధిక శతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పడికి, ఆంధ్ర లో మాత్రం బీజేపీ తమకు వద్దు అనే నిర్ణయాన్ని  ఎన్నికల ద్వారా కచ్చితంగా ప్రకటించేస్తున్నారు. 

దీనికి ప్రధాన కారణం ఏపీ రాష్ట్ర

విభజన సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చేసిన అన్యాయాన్నిమాత్రం ఆంధ్ర ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరోప్రక్క విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నేటికీ త్రిశంకు స్వర్గంలోని ఉందని, విశాఖ  స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాలపై బీజేపీ ని క్షమించే అవకాశమే లేకుండా పోయింది. పైగా

కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చెయ్యడానికి ఏపీ బీజేపీ మొత్తం అట్టర్ ఫ్లాప్ కొట్టింది. కేంద్ర పథకాల గురించి ఒక్క నాయకునికి కూడా అవగాహనా లేకపోవడం గమనార్హం.

దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించి కేంద్రం నిధులు ఇస్తున్న పథకాలకు

ప్రధానమంత్రి ఫోటో లేకుండా ఏపీ ఫోటోలు వేసుకోడాన్ని ఆమె ప్రశ్నించడమే. ఆమె అడిగే వరకూ ఏపీ లోని బీజేపీ నేతలు ఎవ్వరూ దీన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం.  

కేంద్రం ఇచ్చిన ప్రతి రూపాయినీ రాష్ట్రం లో అధికార పార్టీ తన బ్రాండ్ మార్క్ ప్రచారం చేసుకుంటే కనీసం నోరెత్తే నాధుడే లేకపోవడం ఏపీ లో బీజేపీ చేతగాని తనం

బహిర్గతమవుతోంది. 

విశాఖ మహా నగరం మేయర్ గా బీజేపీ అభ్యర్థి ఎన్నికైన నాటి నుంచి నేడు అదో పాతాళానికి దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తిరిగి బ్రతికి బట్టకట్టాలి అంటే సాక్షాత్తు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి దిగ్గజాలు వచ్చినా జీవం పోసుకోవడం అతికష్టంగానే కనపడుతోంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam