DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిరణం చేరికతో భారతీయ కమలం ఆంధ్ర ప్రదేశ్ లో వికసించేనా? 

*బీజేపీ లో చేరిన ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం / న్యూ ఢిల్లీ, 2023 (డిఎన్ఎస్ ):*దేశం మొత్తం సోనియా పిలుపు కోసం గుమ్మం దగ్గర కాపలా కాస్తున్న సమయంలో క్లారి టీ కావాలి అనే ఒక్క మాట తో ఆమెను ఎదిరించి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి గా సంచలనమైన నిర్ణయాలు తీసుకుని, కాంగ్రెస్ అధిష్టానం తో పాటు, పార్టీ లోని సహచరులను సైతం ముప్పు తిప్పలు పెట్టిన వ్యక్తి. 

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పటిష్టంగా ఉన్న బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పూర్తిగా జీవం లేకుండా చతికిల

పడింది. ఈ దుస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సమర్ధ నాయకుడు బీజేపీ లో చేరడం ద్వారా పునరుజ్జీవం వస్తుందనే ఆశాభావంతో క్యాడర్ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కమిటీ లో కేవలం విష్ణు వర్ధన్ రెడ్డి మినహా మరో నాయకుడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో కనిపించక పోవడం గమనార్హం. 

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరడం

అయితే జరిగింది. అయితే ఆయనకు కేంద్ర కమిటీ ఏ భాద్యతలు ఇస్తుందో చెప్పలేదు. ఒకవేళ ఆంధ్ర కు పంపితే. . పెద్దగా చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కడు కూడా లేకపోవడం, తో పాటు,  ఏపీ లో దాదాపుగా నిర్వీర్యం అయిపోయిన పార్టీ లో చేరి, ఆయన పెద్దగా ఉద్దరించేది ఏమీ ఉండదు. తెలంగాణ లో ఇప్పడికే ఉత్తేజితులైన బండి సంజయ్, రాజాసింగ్,  డి. అరవింద్,

లాంటూ యువకులతో ధీటుగా పనిచేసే అవకాశం కిరణ్ కు ఉంటుందా అనేది సందేహమే. 

దాదాపు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు. శుక్రవారం దేశ రాజధాని హస్తినలో భారతీయ జనతా పార్టీ లో చేరడం మరో సంచలనంగా మారింది. అసంబద్ధంగా రాష్ట్ర విభాగం చేసారంటూ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టిన కిరణ్ తదుపరి దాదాపు దశాబ్ద కలం స్తబ్దతగా

ఉంది, ఒక్కసారిగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో దర్శనమిచ్చారు. 

జాతీయ పార్టీ కార్యాలయంలో విలేకరులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానని ఎన్నడూ అనుకోలేదని, గాడితప్పిన నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేసిందని అన్నారు.  ఎంతో అభిమానించిన ప్రజలు

సైతం నేడు కాంగ్రెస్ ను పారద్రోలుతున్నారన్నారు. గత కొన్నాళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ శాఖామంత్రి అమిత్ షా ల పనితీరు క్షున్నంగా పరిశీలించిన మీదట, సహచరులతో చర్చించి, బీజేపీ లో చేరడం జరిగిందన్నారు. 

కేంద్ర బొగ్గు, గనులు ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, భారతీయ జనతా పార్టీ

జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ, అరుణ్ సింగ్ ల సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది. 

ఈ సభలో బీజేపీ బిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె .లక్ష్మణ్, ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam