DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 15 న విశాఖ వీధుల్లో బైక్ ర్యాలీగా విరాట్ హనుమాన్ శోభాయాత్ర

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*వందలాది బైక్ లతో ర్యాలీ, వేలాదిమందితో శోభాయాత్రకు ఏర్పాట్లు*

*విశాఖపట్నం, ఏప్రిల్ 11, 2023 (డిఎన్ఎస్ ):* సమాజంలో శాంతి నింపాలి, దుష్ట శిక్షణ జరగాలి అనే సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ మహానగర్ ఆధ్వర్యవంలో ఈ నెల 15 న విరాట్ veera హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. భారీ

బైక్ లతో, కార్లతో జరిగే ఈ విజయోత్సవ ర్యాలీ ఏప్రిల్ 15 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కరాసా వద్ద గల పెట్రోల్ బంక్ నుంచి బయలు దేరనుంది. విశాఖ మహా నగర వీధుల్లో జాతీయ రహదారి మీదుగా 15 కిలో మీటర్ల దూరం ప్రయాణించి బీచ్ రోడ్ లోని పామ్ బీచ్ హోటల్ దగ్గరకు చేరుతుంది. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి వందలాది మంది హిందూ బంధువులు

అందరితో కలిసి శోభాయాత్రగా రామకృష్ణ బీచ్ వద్ద గల భవతారిణి కాళీమాత దేవాలయం వరకూ సాగనుంది. ఈ శోభాయాత్ర 4 కిలోమీటర్ల దూరం బీచ్ రోడ్ లో ప్రజలందరిలోనూ చైతన్యం కల్గించే విధంగా సాగుతుంది. ఈ బైక్ ర్యాలీ లోను, తదుపరి శోభాయాత్ర లోనూ నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ మహా విశాఖ నగర కమిటీ

ఆహ్వానిస్తోంది. ఇప్పడికే మహా విశాఖ నగరం లోని ప్రతి కోలనీ లోనూ ఈ వీర హనుమాన్ విరాట్ శోభాయాత్ర గురించి ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ప్రధానంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. 

బైక్ ర్యాలీ లో పాల్గొనే హిందూ బంధువులు ఏప్రియల్ 15 వ తేదీ మధ్యాహ్నం 2 :30 గంటలకు కరాస చేరుకోవాలన్నారు. 

ఇప్పడికే

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హనుమాన్ విజయోత్సవ ర్యాలీలు, శోభాయాత్రలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పిడిప్పుడే ఉత్తరాంద్ర జిల్లాలో ఊపందుకున్న హిందూ ధర్మ ప్రచారం ఈ ryalito మరింత విస్తృతంగా సాగుతుంది అనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam