DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమో వరాహ లక్ష్మి నారసింహా...పాహిమాం., రక్షమాం - 1   

*ఈ నెల 23 న సింహాచలక్షేత్రం లో స్వామి నిజరూప దర్శనం*

*చందనయాత్ర సందర్భంగా క్షేత్ర వైభవం మీ కోసం రోజు కో కథనం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 12, 2023 (డిఎన్ఎస్ ):* సమస్త భూమండలాన్ని తన నోటి దంతాలతో ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన శ్రీ వరాహ స్వామి - లక్ష్మి

నరసింహునితో కలిసి  ద్వయ రూపాల్లో భక్తులను అనుగ్రహించే ఏకైక క్షేత్రం శ్రీ సింహాచల క్షేత్రం.

ఏడాది కాలం పాటు పూర్తి చందాన ధారుడై కనిపించే స్వామి కేవలం వైశాఖ శుద్ధ తదియ ( అక్ష తృతీయ) రోజున మాత్రమే స్వామి నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ రోజు ను జరిగే వైభవాన్ని సింహాచల క్షేత్ర చందన యాత్ర లేదా

చందనోత్సవం అని వ్యవహరిస్తుంటారు. ఈ రోజు స్వామిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు సింహగిరికి రావడం ఆనవాయితీగా వస్తోంది. 

సింహగిరి స్థల పురాణం : 

సింహాచలం పౌరాణిక చరిత్ర నేటి సామాన్య చరిత్రకారులకు అందని పురాతన కృతయుగం నాటి పౌరాణిక కాలం నాటిది. అయితే ప్రస్తుతం అందుబాటులో

శాసనాలు, ఇతర ఆధారాలు 11 వ శతాబ్దం నుంచి ఉన్నాయి. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి,

కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. దానిలో భాగంగా ఒక ఎత్తైన కొండపై నుంచి సముద్రంలోని కుమారుణ్ణి తోయిస్తాడు. ఆ ప్రాంతం ఇదే అని కథనం. 

హిరణ్యకశిపుడు ని నరసింహ రూపంలో వధించిన విష్ణు మూర్తి అదే రూపంలో ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చాడు. అయితే అతని కోరిక మేరకు

ముందు అవతారమైన వరాహ రూపం lo దర్శనం ఇవ్వడం తో పాటు  రెండు రూపాలతో ఒకే మూర్తిగా ఈ క్షేత్రంలో వెలిసాడు. నాటి నుంచి ఈ క్షేత్రం ప్రహ్లాదుకుని ప్రార్ధన మందిరంగా మారింది. 

అనంతరం యుగాల తదుపరి చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల

పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ లక్ష్మి నరసింహస్వామి కనిపించాడు. పుట్ట నుంచి స్వామిని బయటకు తీసిన రోజు వైశాఖ శుద్ధ తదియ. కొన్ని యుగాల కలం తర్వాత పుట్ట నుంచి బయటకు వచ్చిన స్వామి. . .ప్రతి ఏడాది ఇదే రోజున సామాన్య భక్తులకు దర్శనం ఇస్తానని ఆకాశవాణి ద్వారా స్వామి తెలియచేసాడు.

మిగిలిన అన్ని రోజుల్లో 12 మణుగుల చందనం ( ఔషధ మూలికలు మిళితం చేసి) కప్పవలసింది అని ఆదేశించాడు.  
అనంతరం స్వామి ఆదేశం మేరకు పురూరవుడు ఇదే ప్రాంతంలో శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామికి శ్రీపాంచరాత్ర ఆగమ విధానం లో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. నాటి సంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. 

తరువాయి.. పార్ట్ 2

లో...

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam