DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల  అష్టబంధన మహాసంప్రోక్షణ పరిపూర్ణం 

తిరుమల, ఆగస్టు 16 ,2018 (DNS Online) : తిరుమల శ్రీనివాసుని ఆనంద నిలయం లో 12 ఏళ్లకోసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం పరిపూర్ణం అయినట్టు

ఆలయ అర్చక బృందం ప్రకటించింది. ఐదు రోజుల పాత  à°…త్యంత వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన à°ˆ మహా యజ్ఞం ఆగమ సలహా మండలి సూచనల మేరకు తిరుమల పెద్దజీయంగార్‌,

 à°šà°¿à°¨à±à°¨à°œà±€à°¯à°‚గార్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో నిర్వహించారు.  à°…ర్చకులు ఖాద్రి నరసింహాచార్యులు చేతులమీదుగా

ఆనందనిలయ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ జరిగినట్టు తెలిపారు. యాగశాల కార్యక్రమాల అనంతరం భోగ శ్రీనివాసమూర్తి,  à°‰à°—్ర శ్రీనివాసమూర్తితోపాటు ఇతర

దేవతామూర్తులను తిరిగి పూర్వస్థానాల్లోకి వేంచేపు చేసినట్టు వివరించారు. 
శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు  à°µà±‡à°£à±à°—ోపాలదీక్షితులు మాట్లాడుతూ చివరిరోజు

కార్యక్రమాల్లో భాగంగా 27 హోమ గుండాల్లో పూర్ణాహుతి నిర్వహించినట్టు తెలిపారు. గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు

ఆగమోక్తంగా కళావాహనం నిర్వహించామన్నారు. కళశాల్లోని శక్తిని తిరిగి విగ్రహాల్లోకి ఆవాహన చేయడాన్ని కళావాహనం అంటారని తెలిపారు. ఆ తరువాత ప్రత్యేక ఆరాధనలు,

విశేషనైవేద్యాలు సమర్పించిన అనంతరం అక్షతారోపణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగిసిందన్నారు.
ఈ ఐదు రోజుల కార్యక్రమం లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల

నిష్ణాతులైన 44 మంది ఋత్వికులు, 100 మంది వేదపండితులు  à°ªà°¾à°²à±à°—ొన్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 11 నుండి ఆగస్టు 15à°µ తేదీ సాయంత్రం

వరకు 1.35 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలియజేశారు. ఆగస్టు 17వ తేదీ నుండి యధావిధిగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని వివరించారు.
ఆఖరి

రోజైన గురువారం ఉదయం కార్యక్రమాల్లో భాగంగా హోమగుండాలకు పూర్ణాహుతి, ప్రబంధ సాత్తుమొర, వేద సాత్తుమొర నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులతోపాటు

ఋత్వికులను ఆలయ ప్రదక్షిణగా అర్చక నిలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అర్చక బహుమానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు,

అర్చకులు ఇతర సభ్యులు పాల్గొన్నారు. 
గరుడ పంచమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు

దర్శనమివ్వనున్నారు. రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.

 

pix: courtesy : TTD

 

#dns #dnsnews  #dns news  #dnslive  #dns live  #dns media  #dnsmedia  #tirumala  #tirupati  #TTD  #samprokshana #balalaya #temple #purnahuti

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam