DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి వారణాశి కి గంగ పుష్కర్ రైలు ప్రారంభం  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2023 (డిఎన్ఎస్ ):* విశాఖపట్నం నుండి నేరుగా వారణాశి (కాశీ) వెళ్లేందుకు ప్రవేశపెట్టిన గంగా పుష్కరాల స్పెషల్ రైలు ను ఎంపి రాజ్యసభ జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు. బుధవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమం లో అయన మాట్లాడుతూ తెలుగు

వారికీ అత్యంత ప్రాధాన్యమైన ఉత్సవాల్లో పుష్కరాలు ఒకటన్నారు. ఈ నెల 22 నుంచి మే 3 వరకూ జరుగుతున్నా గంగ పుష్కరాల సమయంలో వేలాది మంది కాశి వెళ్ళటం వెళ్లడం జరుగుతుందన్నారు. వాళ్ళ సౌకర్యం కోసం  కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ తో మాట్లాడి విశాఖపట్నం నుంచి నేరుగా దీన్దయాల్ రైల్వే స్టేషన్ (కాశి సమీపంలో) వరకు వెళ్లేవిధంగా

గంగానది పుష్కరాలు మరియు వేసవి సెలవుల నేపద్యంలో ప్రత్యేక రైళ్లను నడపవలసిందిగా కోరడం జరిగిందన్నారు.  

కేంధ్ర రైల్వే శాఖ మంత్రి ఎంపి రాజ్యసభ జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి మేరకు మంజూరు చేసి బుధవారం మొదటి సారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి బయలు దేరిందన్నారు. ఈ సందర్బంగా ఆ రైలు ప్రయాణికులకు మిఠాయిలు

పంచి అభినందనలు తెలిపారు. దేశ ప్రదాని నరేంద్ర మోదీ లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గ మైన వారనాసిలో తెలుగు ఆశ్రమాల సంఘాలకు గంగానది పుష్కరాల సందర్బంగ గౌరవ అధ్యక్షులు నియమితులవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తాను కోరిన వెంటనే రైళ్లు ఏర్పాటు chesina కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలిపారు. 12 రోజులపాటు కాశీలో

గంగా పుష్కరాలకు తెలుగు రాష్టాృల నుండి వెల్లే భక్తుల నిమిత్తం హెల్ప్ లైను ఏర్పాటు చేసామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడ ఏర్పాటు చేసామని చెప్పారు. కార్యక్రమంలో రాష్టృ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam