DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై అంతరాలయం దర్శనం రద్దు చెయ్యండి: ట్రస్టీలు 

*ప్రోటోకాల్ విఐపిలకు కూడా భోగమండపం వరకే ఉండాలి*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 20, 2023 (డిఎన్ఎస్ ):* అక్షయ తృతీయ అనగా వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాచలం దేవస్థానం స్వామి వారి నిజరూప దర్శనం (చందన యాత్ర) రోజున అనువంశక ధర్మకర్తకు, యతీశ్వరులకు మినహ మిగిలిన అందరికి అంతరాలయ

దర్శనం రద్దు చెయ్యాలని ట్రస్ట్ బోర్డు తీర్మానం చేసింది. ఈ మేరకు సింహాచలం క్షేత్రం ధర్మకర్తల మండలి సభ్యులు జిల్లా కలెక్టర్ కు ఒక లేఖ వ్రాసారు. 
మంత్రులు, ప్రజా ప్రతినిధులు , అధికారులు తదితర విఐపి లు కూడా సామాన్య భక్తుల వలె స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా మరింత ఎక్కువ మంది భక్తులకు దర్శనం chesukune అవకాశం ఉంటుందని

తెలిపారు. 

అంతరాలయ దర్శనం అనగా గర్భగుడి దర్శనము ఆచార వ్యవహారాల దృష్ట్యా ఇవ్వాలని శాస్త్ర ప్రకారం వంశపారంపర్య ధర్మకర్త, యతీశ్వరులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని కోరారు. మిగిలిన అన్ని రకాల ప్రోటోకాల్ దర్శనములు కూడా ( మంత్రులు నుండి విఐపిల వరకు ) భోగ మండపము వరకు మాత్రమే అనుమతించాలని కోరారు. 
ఉప ముఖ్యమంత్రి,

దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా సామాన్య భక్తునిగా దర్శనం చేసుకుని  ఇతరులకు ఆదర్శవంతంగా నిలవాలనే వారి ఆకాంక్ష వలన, తాము కూడా అదే nirnayaniki కట్టుబడి ఉన్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam