DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందనయాత్రలో ట్రస్టీల మాట పాటించి ఉంటె పరువైన దక్కి ఉండేది 

*గర్భాలయ దర్శనం వద్దు అన్న ట్రస్టీల మాటకు చెల్లుచీటీ, కమిటీకి చీవాట్లు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 26, 2023 (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర జిల్లా ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చందనయాత్ర రోజున ట్రస్టు బోర్డు సభ్యులు ఇచ్చిన సలహాలు పాటించి ఉంటె

నిర్వహణ కమిటీ పరువు దక్కి ఉండేది. ఈ నెల 20 వ తేదీన ఆలయ ఈఓ కు ట్రస్టు బోర్డు సభ్యులు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజరూపం రోజున గర్భాలయం దర్శనం కేవలం ధర్మకర్త, మంత్రి, పీఠాధిపతులు తప్ప ఇంకెవ్వరికి వద్దు అంటూ లేఖ ఇచ్చారు. తాము కూడా సాధారణ భక్తుల వలే దర్శనం చేసుకుని వెళ్ళిపోతామంటూ ఆ లేఖలో సందేశం. అయితే వీళ్ళ సొంత

నిర్ణయానికి అధికార పార్టీ చాలా సీరియస్ అయ్యింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు లేదు అంటూ నానా చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది.
వీళ్ళు చెప్పిన విధంగా జరిగి ఉంటె. . గర్భాలయంలో దర్శనం కేవలం ఒక గంట వరకే పరిమితి అయి ఉండేది. సామాన్య భక్తులు దర్శనం తొందరగా చేసుకుని ఉండేవారు. అయితే దేవుని పేరిట ధనార్జనే

 లక్ష్యంగా సాగిన ఈ ఉత్సవం లో నిర్వహణ పూర్తిగా వికటించి, ఉదయం లక్షలాదిగా భక్తులు నరక yatana పడ్డారు. అదే రోజు రాత్రి  సహస్ర ఘటాభిషేకం లో పాల్గొనేందుకు వెళ్తున్న వేదిక స్వాముల సాక్షిగా మహిళా భక్తులపై అత్యంత పాశవికంగా పోలీసులు చేసిన లాఠీ ఛార్జి పై  ఫలితం నిర్వహణ కమిటీలోని  ప్రతి ఒక్కరూ అనుభవించే రోజు తప్పక

వస్తుందని వైదిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ట్రస్ట్ బోర్డు సభ్యులు ముందుగా చెప్పినట్టు గర్భాలయ దర్శనం కేవలం కొందరికే ఇచ్చి ఉంటె. . భక్తులు ఇంత సమయం క్యూల్లో ఉండవలసి వచ్చేది కాదు. 

ప్రధానంగా అందరి నోటా వినిపిస్తున్న అంశం ఒక్కటే. . దేవాదాయ శాఖా, దేవాలయ వ్యవస్థ పరిధిలో ఉన్న సింహాచల

క్షేత్రం లో ఉత్సవ నిర్వహణను దేవాదాయ శాఖతో ఏమాత్రం సంబంధం లేని రెవెన్యూ విభాగానికి, పొలిసు విభాగానికి ఎందుకు ఇచ్చినట్టు.? అంతరాలయంలోకి డ్యూటీ చేసేందుకు ఇద్దరు మహిళలు,  పొలిసు సిబ్బంది ఎలా వెళ్లారు అనేదే తెలియాలి. అసలు గర్భాలయంలో వీడియోలు  తీస్తున్నప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారు అనేది కూడా

తెలియాలి. 

మొత్తానికి దేవాలయ ఉత్సవ నిర్వహణలో ఏమాత్రం అనుభవం లేని అధికారుల చేతిలో ఎందుకు పెట్టారు అన్నది వైదిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అనుభవం లేని వాళ్ళు, అవగాహనా లేనివాళ్లు మొత్తం కలిసి హిందూ దేవాలయ పరువును గంగపాలు చేశారు అన్నది మాత్రం వాస్తవం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam