DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర శ్రేయస్సు కోసం 12 నుంచి విజయవాడ లో శ్రీ మహాలక్ష్మి యాగం 

*దేవాదాయశాఖ చే చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత యాగం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మే 02, 2023 ( DNS Online):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈ నెల 12 నుంచి 17 వరకూ విజయవాడ లో చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. రాష్ట్ర

దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో జరుగుతున్నా ఈ యాగంలో అన్ని ఆగమ విధానాల్లోనూ వివిధ యాగశాలలు నిర్మించి, హోమాదికాలు నిర్వహించనున్నారు. ప్రజల సౌభాగ్యం, సంపద, ధర్మాభివృద్ది, వ్యవసాయ పంటల అధిక దిగుబడి కోసం విజయవాడ లోని ఇందిరా  గాంధీ మునిసిపల్ స్టేడియం లో 
ఈ నెల12 న ఉదయం 9. 28 నిమిషాలకు శ్రీమహాలక్ష్మి యాగం ఆరంభం కానుంది.

 17 న మధ్యాహ్నం మహా పూర్ణాహుతి తో కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. 

మొత్తం 108 కుండలు, 2 ప్రధాన హోమ కుండలతో మొత్తం 8 ఆగమాలు అనుసరించి జరుగుతుంది. శ్రీపాంచరాత్రం, వైఖానసం, వైదిక స్మార్తం, శైవం , చాత్తాద శ్రీవైష్ణవ, గ్రామదేవత ఆరాధన, వీర శైవం, తంత్ర సారం, అనే ఆగమాలు ప్రకారం హోమాలు, పారాయణాలు

జరుగనున్నాయి. 

సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గ అమ్మవారు, శ్రీకాళహస్తి, శ్రీశైలం, దేవాలయ నుంచి రోజుకు ఒక దేవాలయ దేవతలకు శాంతి కళ్యాణం జరుగుతుంది. 
 
శ్రీ పాంచరాత్ర ఆగమం లోని శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం, శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్థానం, నెల్లూరు,  శ్రీ

నెట్టికంటి అంజయ్య స్వామి దేవస్థానం కసాపురం, ఇతర ఆగమాల్లోని దేవాలయాల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

ఈ యాగం లో వాడే పూజ సామాగ్రి వివరాలు: మోదుగ, రావి, జమ్మి, జువ్వి, మేడి / మామిడి చెట్ల నుంచి సమిధలు ఒక్కో హోమకుండానికి రోజుకు 10 కేజీల చొప్పున 134 హోమకుండలకు గాను రోజుకు 1340 కేజీలు సమిధలు, మొత్తం 5

రోజులకు గాను  6700 కిలోల సమిధలు సుమారు 10 టన్నులను సమకూర్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంటిమొత్తం లో ఆవునెయ్యి కూడా సేకరించవలసి ఉంటుంది. 

వివిధ వేదికల హోమకుండాల ర్మాణం:
ఒక్కో ఆగమం ప్రకారం హోమకుండల నిర్మాణం జరుగుతుంది. వివిధ వేదికలు ఏర్పాటు, ప్రధాన వేదికలు, వేద పండితులకు మరొక వేదిక, భజంత్రీలకు ఒక వేదిక, కళ్యాణం,

సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంకొక వేదిక, తదితర వేదిక నిర్మాణం జరుగుతోంది. 

భారీ మొత్తంలో తులసి మొక్కలు, పూల కుండీల ఏర్పాటు, ప్రతి రోజూ గోపూజలు, వాటికి తగిన మేత, మంచినీటి సౌకర్యం, తదితర కనీస ఏర్పాట్లు చేయడం జరుగుతోంది.

ఈ కార్యక్రమం పూర్తిగా హిందూ దేవాదాయ శాఖా నిర్వహణలోనే జరుగుతోంది.

నిధులు పూర్తిగా భక్తులు రాష్ట్రంలోని వివిధ హిందూ దేవాలయాల్లోని హుండీల్లో భక్తులు వేసిన మొక్కుబడులు నుంచే ఈ యాగంలో వినియోగించడం జరుగుతోంది, తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు.

కార్యక్రమం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నట్టు ప్రకటించినా, అధికార పార్టీ రాబోయే ఎన్నికల్లో

మరొక్కసారి విజయం సాధించాలి అనే సంకల్పం తో ఈ యాగం చేస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా. . .సమాజ శ్రేయస్సు కోసం జరుగుతున్న ఈ యాగం ద్వారా వాతావరణం ప్రక్షాళన జరిగి, వాయు కాలుష్యం తగ్గిస్తుంది. ప్రతి రోజూ హవనం, వేదగోష, గో ధూళి ప్రసరిస్తున్నందున వీటి ప్రభావం వలన ప్రజలకు మంచి ఫలితాలు లభిస్తాయి. 



యాగంలో హోమకుండల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లోని సిబ్బందిని, వేదపాఠశాలల విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనున్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam