DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 న సురభి చే మొట్టమొదటి సారి సాంఘిక నాటక ప్రదర్శన

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మే 25, 2023 ( DNS Online):* భారతదేశ నాటక రంగ చరిత్రలో జానపద, పౌరాణిక నాటకాలకు అత్యంత ప్రఖ్యాతి గాంచిన సురభి కల బృందం చే మొట్టమొదటి సారిగా సాంఘిక నాటక ప్రదర్శన విశాఖ లో జరుగనుంది. 

మొట్టమొదటి నాటక గ్రంథాలయం కు శాశ్వత నిధుల కోసం రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో

ఘంటసాల జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాదంగీర్ సాయి తెలిపారు.
విశాఖ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ భాస్కరుని సత్య జగదీష్  దర్శకత్వంలో ఈనెల 28న ఆదివారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.
సాయంత్రం 5

గంటలకు అలాగే రాత్రి 7:30 గంటలకు వరుసగా రెండు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రదర్శనకు రూ. 300 లు, రూ.200లు, రూ.100 ల డోనర్ పాసులు అందుబాటులో కళాభారతి లోనూ, రంగసాయి నాటక గ్రంథాలయం నందు మరియు  సాయి బాదంగీర్ సెంటర్ వద్ద 26వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయని తెలిపారు. మిగతా వివరాలు కొరకు 9440458458 కి ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

సీనియర్ పాత్రికేయులు ఎన్. నాగేశ్వరరావు (ఎన్. ఎన్. ఆర్) మాట్లాడుతూ శ్రీ భాస్కరుని సత్య జగదీష్ రచన, దర్శకత్వంలో శ్రీ సాయి సంతోషి నాట్యం మండలి సురభి వారిచే ప్రదర్శిస్తున్న తొలి సాంఘిక నాటకమని పేర్కొన్నారు.
138 సంవత్సరాల చరిత్ర గల సురభి వారిచే ఘంటసాల జీవిత చరిత్ర నాటకం ప్రదర్శించడం గొప్ప విషయం అన్నారు. తప్పకుండా అందరూ

కలిసి చూడవలసిన నాటకమని వెల్లడించారు. విశాఖ ప్రజలు ఈ నాటకాన్ని వీక్షించాలని తెలిపారు.
ఒక మంచి నాటకాన్ని విశాఖ ప్రజలకు  అందించేందుకు రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకులు బాదంగీర్ సాయి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న బాదంగీర్ సాయికి  అభినందనలు తెలియజేస్తున్నట్లు

చెప్పారు. విశాఖ ప్రజలు తప్పకుండా ఈనెల 28న ఈ కార్యక్రమానికి హాజరై ఈ నాటకం చూడాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam