DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒడిశా రైళ్ల ప్రమాదం పై జనం లో అనుమానాల వెల్లువ 

*లోకో పైలట్ల పై ఒత్తిడి, సాంకేతిక లోపం, సిబ్బంది నిర్లక్ష్యం?* 

*(DNS Report: P. Raja, Bureau Chief, Amaravati)* 

*Amaravati, June 3, 2023 (DNS Online) :* శుక్రవారం రాత్రి ఒడిశా లో జరిగిన అత్యంత ఘోర రైళ్ల ప్రమాదానికి కారణాలపై ప్రజల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా సాంకేతిక సమస్యగా అధికారులు చెప్తున్నడికి రైళ్ల లోకో  పైలట్లకు

తగినంత విశ్రాంతి ఇవ్వక పోవడంతో పాటు, వాళ్లపై అధికారులు పెడుతున్న ఒత్తిళ్లు కూడా కారణం కావచ్చు అనే అనుమానాలు జనంలో ఉన్నాయి. దీనికి ప్రధాన నిదర్శనమే ఇటీవల రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే లోకో పైలట్లు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ నిరసనలు తెలియచేసారు. తమకు అధికారులు పెడుతున్న ఒత్తిళ్ల

కారణంగా మానసిక రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసారు. 
ఈ తరహా వేధింపులు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయని, భర్తీ చేయాల్సిన ఖాళీలలో నియామకాలు చేయకుండా ఉన్న కొద్దీ మంది డ్రైవర్ల టోన్ పూర్తి స్థాయి డ్యూటీ లు చేయిస్తున్నారంటూ మండిపడిన విషయం తెలిసిందే.

అదే తరహా ఒత్తిళ్లు ఒడిశా

మార్గంలోని రైళ్ల లోకో పైలట్లు కూడా అనుభవించి ఉండవచ్చు అనే సందేహం అందరిలోనూ ఉంది.

ఇక మూడో అంశం సాంకేతిక పరంగా తలెత్తిన సమస్యలు. అత్యంత ఆదరణ కల్గిన కోరోమండెల్ రైళ్లకు ఎటువంటి కవచ్ విధానం లేకపోవడం కూడా కారణం కావచ్చు. పైగా ఈ రైళ్లల్లో ఎల్ హెచ్ బి లు ఉన్నా, ప్రమాదాన్ని నివారించక పోవడం రైల్వే శాఖా నిరక్ష్యంగా

ప్రయాణికులు తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam