DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ సీఎం కు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంస

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూన్  05, 2023 ( DNS Online):* ఒడిశా లో జరిగిన రైళ్ల ప్రమాదం అనంతర సహాయక చర్యల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసల జల్లు కురిపించారు.

కటక్ లో ఆయన్ను కలిసిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి

గుడివాడ అమర్నాథ్ తాము చేపట్టిన సహాయక చర్యలు , హెల్ప్లైన్ సెంటర్ల ఏర్పాట్లు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సాధారణంగా రైలు ప్రమాదం జరిగినప్పుడు రైల్ శాఖా మాత్రమే హెల్ప్ లైన్ కేంద్రాలు పెడుతుందని, అయితే నేటి ఘటన లో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి రైల్వే స్టేషన్ లోను హెల్ప్ లైన్ సెంటర్ పెట్టి, ప్రయాణీకులకు

అందుబాటులో పెట్టడం అభినందనీయం అన్నారు. 
  
ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి మంత్రి అమర్నాథ్ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, బంధువుల ఆచూకీ తెలియని వారు, వారి ఫోటోలు నేరుగా కంట్రోల్ రూమ్ కు వాట్సాప్ ద్వారా పంపిస్తే,

సదరు వ్యక్తుల సమాచారాన్ని బంధువులకు వీలైనంత త్వరగా అందజేసే ప్రక్రియను చేపట్టామని అమర్నాథ్ మంత్రి అశ్విని వివరించారు. 

దీనిపై స్పందించిన మంత్రి వైష్ణవ్ గతంలో  రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం రైల్వే శాఖ మాత్రమే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

చేయడాన్ని తాను తొలిసారిగా వింటున్నానని చెప్పారు. ఇటువంటి సహాయక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాను అభినందిస్తున్నానని వైష్ణవ్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తన వెంట ఉన్న అధికారులను పిలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై వివరాలు నమోదు చేసుకోవాలని అశ్విని సూచించారు. అలాగే

ఘటన జరిగిన వెంటనే ముగ్గురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యలలో నిమగ్నం చేయడం పట్ల కూడా కేంద్ర మంత్రి అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam