DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 న ఇస్కాన్ వారిచే విశాఖ లో జగన్నాథ రథయాత్ర

*Iskcon to hold Radhayatra on Jun 20 in Vizag*

*20 న ఇస్కాన్ వారిచే విశాఖ లో జగన్నాథ రథయాత్ర*

*(DNS Report: Reddy G, రిపోర్టర్ )*    

*విశాఖపట్నం, జూన్  17, 2023 ( DNS Online):* 

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్ర మహోత్సవమును సంప్రదాయ పూరిజగన్నాధ రధయాత్ర విధానం లో ఆషాడ శుక్ల ద్వితీయ

తిధి పర్వదినము జూన్ 20 వ తేదీ  విశాఖపట్నం నగరంలో వరుసగా 16 వ సారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించ నున్నామని ఇస్కాన్  అధ్యక్షుడు  సాంబదాస్ వెల్లడించారు. శనివారం విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా శ్రీ జగన్నాధ, బలదేవ, సుభద్రాదేవిలు వేరువేరుగా మూడు రథములలో ఒకేసారి ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం

కల్పించనున్నామన్నారు. వేరొక చిన్న రథంపై ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీలప్రభుపాదుల విగ్రహ మూర్తి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రథయాత్ర అలంకరణ కొరకు ఒడిషా లోని పిప్పిలి నుండి ప్రత్యేక అలంకరణ సామాగ్రి తీసుకు వచ్చాము అన్నారు.
ఈ రథాయాత్రలో ఉపయోగించే రథాలు ప్రత్యేకంగా యంత్రనిర్మితమైన 37 అడుగుల రథగోపురాన్ని కలిగి

వున్నాయి అని తెలిపారు.  రథగోపురము  ఎత్తును ట్రాఫిక్ అవసరాలకు అనుగునంగా తగ్గించుకునే, పెంచుకునే వెసులుబాటు ఇస్కాన్  రథయాత్ర ప్రత్యేకత అన్నారు. ఇస్కాన్ మాతాజీ నితాయి సేవిని మాట్లాడుతూ,  ఈ రథాయాత్ర జూన్ 20 మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాతజైలు రోడ్, విశాఖ మహిళా కళాశాల ఎదురుగా గలపార్కింగ్ వద్ద బయలుదేరి, ఎల్.ఐ.సి. భవనం,

డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి చేరుకొని, అక్కడి నుంచి వాల్తేరు మెయిన్ రోడ్ మీదుగా సిరిపురంవద్ద గల గురజాడ కళాక్షేత్రం వద్ద రాత్రి ఏడు గంటలకు ముగుస్తుందన్నారు. 
 దారి పొడవునా ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రదేశాలు, బెంగాల్, ఒరిస్సాల నుంచి వచ్చిన వివిధ భక్తులు నృత్య కీర్తనలు చేయనున్నారు అని పేర్కొన్నారు. ఎన్నో కోలాట

మండలులు కోలాటము చేస్తూ ఆ జగన్నాథుని రథ యాత్రకు మరింత శోభను తీసుకు రానున్నారు. దారి పొడవునా భక్తులందరుకూ కాజా, పులిహోర ప్రసాదవితరణ చేస్తానన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు ఈ దివ్య ఉత్సవములో జగన్నాథునికి సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ జగన్నాథుని నగర యాత్రలో

వేలాదిలక్షలాది మంది సాధారణ భక్తులు స్వామిని దర్శించుకుని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
రథయాత్ర తుది గమ్యస్థాన మైన గురజాడ కళాక్షేత్రం చేరుకున్న తరువాత అక్కడ భక్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి శ్రీమాన్ సాంబ ప్రభు , పూజ్య నితాయి సేవినీ మాతాజీ వారి ముఖ పద్మాల నుంచి వెలువడే జగన్నాధ

స్వామివారిలీలా విశేషాలను ఆస్వాదించనున్నారు. భక్తులు జగన్నాథ స్వామి వారికి 501 రకాలైన ప్రత్యేక వంటకాలను అర్పించి దానిని భక్తులందరకూ వితరణ చేయడం జరుగుతుందన్నారు. రాత్రి  భక్తజనావళికి భోజన ప్రసాద పంపిణీ వుంటుందన్నారు.
ఎవరైతే శ్రీ జగన్నాధస్వామి వారిని ఆయన పవిత్రరధం మీద ఉండగా దర్షించు కుంటారో, వారికి పునర్జన్మ

ఉండదని వైదిక శాస్త్రాలు భాషిస్తున్నాయన్నారు.  
రథయాత్ర ప్రారంభోత్సవం లో రాష్ట్ర ఐటి మంత్రి గుడివాడ అమర్నాధ్ , ఎంపి సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్, మేయర్ హరి వెంకట కుమారి, శాసనసభ్యులు, తదితరులు పాల్గొంటారన్నారు. 

ఇస్కాన్ ఆధ్వర్యవం లో సంఘ సంస్థాపకాచార్యులు, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఈ

జగన్నాధ రథయాత్ర మహోత్సవమును మొట్టమొదటిసారిగా 1967 లో అమెరికాలో పరిచయం చేసారన్నారు. ఈ సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధి వంశీ కృష్ణ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam