DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 5 న విశాఖ కు ఉడుపి పుతిగే పీఠాధిపతులు రాక 

*ఆంధ్ర ప్రదేశ్శ్రీ పర్యటనలో సుగుణేంద్ర త్రీఠ స్వామీజీ బృందం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూన్  19, 2023 ( DNS Online):* ద్వైత siddanta ప్రచారకులు మధ్వాచార్యులు స్థాపించిన పీఠాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన పీఠం ఉడుపి లోని పూతీగె పీఠం. కోటి గీతా లిఖిత యజ్ఞం ను పురస్కరించుకుని పూతీగె

పీఠాధిపతులు శ్రీ శ్రీ సుగుణేంద్ర త్రీఠ స్వామీజీ, ఆయన శిష్యులు *శ్రీ సుశ్రీంద్ర త్రీత* స్వామీజీ జులై 5 న విశాఖనగరానికి విచ్చేయనున్నారు. “భారత్ పరిక్రమ్” (పర్యాటన  యాత్ర)లో భాగంగా 4 జూలై 2023 నుండి 10 జూలై 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్‌ లోని వివిధ నగరాలను వారు  సందర్శిస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా స్వామిజీ విట్టల

స్వామికి.సంస్థాన పూజ మరియు తొట్టిలు పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులనుద్దేశించి స్వామిజి అనుగ్రహ భాషణం చేయనున్నారు. జులై 6 న సాయంత్రం బయలు దేరి కాకినాడకు చేరుకోనున్నారు. విశాఖ కు విచ్చేస్తున్నస్వామిజి యాత్రలో పెద్ద  సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా  పూతీగె పీఠం నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. 
జులై 5 , 6

తేదీల్లో విఠల భగవానునికి ప్రత్యేక పూజలు, పూజ్య స్వామీజీ పాదపూజ నిర్వహించనున్నారు. వారి ఆశీస్సులు పొందడానికి కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో కలిసి పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. 

ఈ కార్యక్రమం లో కోటి భగవద్గీత లేఖ యజ్ఞానికి సంబంధించిన నేరుగా భగవద్గీత పుస్తకాన్ని స్వామీజీ భక్తులకు అందించనున్నారు.

స్వామిజి పర్యటన వివరాలకు  చందన్ కారంత్ - 8139804669 నెంబర్ ను సంప్రదించవచ్చు. 

స్వామిజి ఆంధ్ర ప్రదేశ్ పర్యటన తేదీలు:

  జూలై 4 - పూరి నుండి శ్రీకాకుళం
  జూలై 5 - శ్రీకాకుళం నుండి విశాఖపట్నం
  జూలై 6- విశాఖపట్నం నుండి కాకినాడ
  జూలై 7- కాకినాడ నుండి రాజమండ్రి,  రాజమండ్రి నుండి విజయవాడ
  జూలై 8 -

విజయవాడ నుండి తిరుపతి
  జూలై 9 - తిరుపతి
  జూలై 10- తిరుపతి నుండి ములబాగిలు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam