DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరి ప్రదక్షిణ లో ఘోర అపచారం, కళ్ళు మూసుకున్న ఈఓ, సిబ్బంది 

*బూట్ల తోనే అప్పన్న రధాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్.*

*ఇలాంటివి ఈఓ కు కొత్తకాదు. అన్నవరంలోనూ ఇలాగే: విహెచ్పి మండిపాటు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 02, 2023 ( DNS Online):* హిందూ దేవాదాయశాఖ లో ప్రతిరోజూ వెలుగు చూస్తున్న నిర్లక్ష్య వైఖరి మరోసారి సింహాచల దేవస్థానం

అధికారుల ద్వారా బహిర్గతమయ్యిందని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం గిరి ప్రదక్షిణ యాత్ర లో వేలాదిమంది భక్తులు స్వామి కొండ చుట్టూ 32 కిలోమీటర్ల దూరం పరిక్రమణ చేస్తారు. ఆదివారం జరిగిన ఈ యాత్ర

ప్రారంభోత్సవంలో స్వామి వారి రధాన్ని అందరి కంటే ముందుగా  నడపడం ఆనవాయితీ. దీన్ని నగర ప్రముఖులచే ప్రారంభింప చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ను ఆహ్వానించారు. తెలిసో తెలియకో ఆయన తానూ వేసుకున్న ఇనుప బూట్లు తియ్యకుండానే స్వామి వారి గరుడ పతకంతో రధాన్ని

ప్రారంభించేశారని అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మఠ మందిర్  టోలీ పూడిపెద్ది శర్మ మండిపడుతున్నారు.   

తదుపరి స్వామికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఆ సమయంలో అయన ప్రక్కనే ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఆలయ స్థానాచార్యులు డా. టీపీ రాజగోపాల్, ఇతర ఆలయ అర్చకులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు సహా ఆలయ సిబ్బంది పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా సీపీ కి బూట్లు విప్పమని చెప్పక పోవడం వీరి నిర్లక్ష్యానికి ప్రధాన నిదర్శనం అన్నారు.  

వీళ్ళందరూ స్వామి ఆలయంలో హుండీల్లో భక్తులు వేసే ముడుపుల నుంచి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న వారే. పైగా వీరి విధుల్లో ప్రధానమైనది. .స్వామి కి ఆగమ విధానంలో గాని, అర్చనల్లో గాని

ఎటువంటి తప్పులు జరుగకుండా చూడడమే. ఆలయం పరిధిలో అత్యంత ఉన్నతాధికారి శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామీ తప్ప, రాష్ట్ర అధికారులు, పాలకులు కాదన్నారు. 

అలాంటిది ఆదివారం స్వామి వారి రథయాత్రలో జరిగిన తప్పిదానికి ఆలయ ఈఓ, స్థానాచార్యులదే భాద్యత వహించాల్సి యుంటుంది. పైగా ఆగమ, వైదిక సిబ్బంది లో దోషాలు ఎత్తిచూపే

స్థానాచార్యులు, పోలీస్ కమిషనర్ కు ఎందుకు చెప్పలేదు అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నేత మండిపడుతున్నారు.  

విధుల్లో నిర్లక్ష్యం ఈవో కు కొత్తకాదు..

గతంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈఓ గా పనిచేసిన సందర్భంలో రత్నగిరి కొండపై భజన మండపంలో ఏకంగా క్రైస్తవ ప్రార్ధనలు,

పాటలు పాడుతుంటే. .. వాళ్ళని ఆపవలసి ఉండగా, వాళ్ళని రెడ్ హండెడ్ గా మీడియా పెట్టుకుని, దీని పై ఈఓ ని ప్రశ్నించగా తాను అక్కడ లేనంటూ చాల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భం ఉందన్నారు. 

ఆదివారం గిరి ప్రదక్షిణలో జరిగిన తప్పిదానికి ఆలయ ఈఓ త్రినాధరావు, స్థానాచార్యులు, భాద్యత వహించాలని తెలిపారు. 

ఎవరైనా

ప్రసాదం ఇస్తేనే. . కాళ్ళకి ఉన్న చెప్పులు విప్పి మరీ తీసుకుంటారని, అలాంటిది స్వామి రధం ప్రారంభం సమయంలో బూట్లుతోనే ప్రారంభించడం, కొబ్బరికాయ కొట్టడం తప్పిదమేనన్నారు. ఇదే సమయంలో కొందరు ఆలయ ట్రస్టీలు కూడా కాళ్ళకి చెప్పులతోనే కొబ్బరికాయలు కొట్టడం గమనార్హం. 

ఇదే విధంగా ఇతర ప్రార్ధన స్థలాల్లోకి వాళ్ళ

సంప్రదాయం పాటించడకుండా వెళ్లగలరా అని ప్రశ్నించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam