DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నగర అభివృద్ధి పై అటల్ జి సంతకము : ఎంపీ హరిబాబు 

విశాఖపట్నం, ఆగస్టు 17 ,2018 (DNS Online): విశాఖ నగర అభివృద్ధి పై అటల్ జి సంతకం చేసి వెళ్లిపోయారని, విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్. కె. హరిబాబు అన్నారు. శుక్రవారం నగరం లోని

బీజేపీ కార్యాలయం లో సంస్మరణ సభలో జరిగిన సభలో అటల్ జీ ఖ్యాతిని అయన గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ దేశ ప్రజలను శోకసంద్రంలో ముంచి గగనానికి

ఎగిశారన్నారు. విశాఖ నగరం లో నేడు అంతర్జాతీయ విమానాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయంటే నాడు అటల్ జి ఈ విమానాశ్రయ అభివృద్ధి కి కృషి చేసారని, రాత్రి వేళల్లో

విమానాలు అసలు ఇక్కడ దిగుతాయా అని విశాఖ వాసులు అనుకునే రోజుల్లో, అయన చేసిన కృషి కి ఫలితంగానే అనతికాలంలోనే అంతర్జాతీయ విమానాలు రాత్రివేళల్లో రాకపోకలు

సాగిస్తున్నాయన్నారు. వాల్మీకి అంబెడ్కర్ గృహ సముదాయం ( వాంబే గృహాలు) దేశ వ్యాప్తంగా నిర్మించి కడుపేదవారికి కూడా నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి అని దేశ

వ్యాప్తంగా బృహత్తర ప్రాజెక్టులు చేపట్టిన ప్రధాని అటల్ బిహారి వాజపేయి అని అన్నారు. ఈ సంస్మరణ కార్యక్రమం లో విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు పి

విష్ణుకుమార్ రాజు, సీనియర్ నాయకులు పివి చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శులు పులుసు జర్నర్ధన రావు, సాగి కాశి విశ్వనాధరాజు, నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర, మహిళా నేత

కొల్లి రత్నకుమారి, రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #bjp  #visakhapatnam  #vizag  #vizag bjp  #atal bihari vajpayee #rememberance 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam