DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల అంతటా ధన ప్రభావమే:ఉడుపి పీఠాధిపతి సుగుణేంద్రతీర్ధ

*దేశ పర్యటనలో భాగంగా విశాఖ కు వచ్చిన పుతిగే పీఠాధిపతులు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 05, 2023 ( DNS Online):* తిరుమల అంతటా ధన మహిమే ఉంటుందని, కొండపైకి ఎక్కినా దగ్గర నుంచి దర్శనం వరకూ ప్రతి చోటా ధన ప్రభావం ఉంటుందని ఉడుపి లోని పూతీగె (మధ్వ) పీఠాధిపతులు, ద్వైత సిద్ధాంత ప్రచారకులు

శ్రీ శ్రీ సుగుణేంద్ర త్రీఠ స్వామీజీ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి లోని పూతీగె (మధ్వ) పీఠాధిపతులు, ద్వైత సిద్ధాంత ప్రచారకులు శ్రీ శ్రీ సుగుణేంద్ర త్రీఠ స్వామీజీ కి విశాఖ నగరంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. ద్వైత సిద్ధాంత ప్రచారకులు మధ్వాచార్యులు స్థాపించిన పీఠాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన పీఠం ఉడుపి లోని

పూతీగె పీఠం. 

సాయంత్రం భక్తులనుద్దేశించి స్వామిజి మాట్లాడుతూ తిరుపతి బాలాజీ కాంచన బ్రహ్మ గాను, పండరి విఠల్ నాద బ్రహ్మ గాను,  ఉడుపి కృష్ణుడు అన్న బ్రహ్మ గాను కొనియాడబడుతున్నారని తెలిపారు. భక్తులకు అదే రీతిలో ధనాన్ని కూడా తిరుపతి బాలాజీ ఇస్తాడని, లేనిపక్షంలో ఎవ్వరూ వెళ్లారన్నారు.  

కోటి గీతా

లిఖిత యజ్ఞం ను పురస్కరించుకుని పూతీగె పీఠాధిపతులు, వారి శిష్యులు శ్రీ సుశ్రీంద్ర తీర్ధ  స్వామీ బుధవారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. స్థానిక రామ్ నగర్ లో గల ఓ మధ్వ పీఠం లో బస చేసారు. నిత్యా ఆరాధనలు అనంతరం స్వామిజి తమ యాత్ర విశేషాలను, తమ సంకల్పాన్ని  భక్తులకు వివరించారు. 

తొలిరోజు సాయంత్రం

పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందారు.  

“భారత్ పరిక్రమ్” (పర్యాటన  యాత్ర)లో భాగంగా 4 జూలై 2023 నుండి 10 జూలై 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్‌ లోని వివిధ నగరాలను వారు  సందర్శిస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా స్వామిజీ విట్టల స్వామికి సంస్థాన పూజ మరియు తొట్టిలు పూజలు నిర్వహిస్తారు. అనంతరం

భక్తులనుద్దేశించి స్వామిజి అనుగ్రహ భాషణం చేయనున్నారు. జులై 6 న సాయంత్రం బయలు దేరి కాకినాడకు చేరుకోనున్నారు. 

విఠల భగవానునికి ప్రత్యేక పూజలు, పూజ్య స్వామీజీ పాదపూజ నిర్వహించనున్నారు. వారి ఆశీస్సులు పొందడానికి కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో కలిసి పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమం లో కోటి

భగవద్గీత లేఖ యజ్ఞానికి సంబంధించిన నేరుగా భగవద్గీత పుస్తకాన్ని స్వామీజీ భక్తులకు అందించారు. 

స్వామిజి ఆంధ్ర ప్రదేశ్ పర్యటన తేదీలు:

ఈ నెల   4 - పూరి నుండి శ్రీకాకుళం చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీకాకుళం, అరసవల్లి, శ్రీకూర్మం క్షేత్రాలను సందర్శించి, అనంతరం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ నెల 6 న

కాకినాడ, జూలై 7 న  రాజమండ్రి, జూలై 8 న విజయవాడ, జూలై 9 - తిరుపతి తదుపరి జూలై 10 న తిరుపతి నుండి ములబాగిలు చేరుకుంటారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam