DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆ ఇంట్లో సభ్యులు కేవలం 185 మందే సభ్యులు, 80 బైక్ లు

*ఒక పూట ఆహరం 50 కేజీల chapati, 25 కేజీల కూర*

*అక్కడ ప్రజా ప్రతినిధులను నిర్ణయించే కుటుంబం ఇదే..*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూలై 10, 2023 ( డిఎన్ఎస్) :* రాజస్థాన్ లోని  అజ్మీర్ జిల్లాలో ఒక కుటుంబం లోని  సభ్యులు కేవలం185  మందే ఉన్నారు. ఒకే భవనం లో  6 తరాలుకు చెందిన సభ్యులు

నివసిస్తున్నారు. 

అజ్మీర్‌లోని రామ్‌సర్ గ్రామంలో ఈ కుటుంబాన్ని 'బాగ్దీ మాలి పరివార్' అని పిలుస్తారు. గ్రామంలో ఈ కుటుంబానికి ప్రత్యేక ఆధిక్యత ఉంది.
ఈ కుటుంబంలో 80 బైక్ లు, 40 ట్రాక్టర్లు, 8 కార్లు, 100 ఆవులు ఉన్నాయి. సుమారు 400 ఎకరాల వ్యవసాయ భూమి లో కొందరు వ్యవసాయం చేస్తుంటారు. కొందరు ఉద్యోగాలు

చేస్తున్నారు. టీచర్లు, డాక్టర్లు, కాంపౌండర్లు, ఇలా అన్ని తరహాల ఉపాధి లో ఉన్నారు. వీళ్ళ ప్రాంతంలోని చట్ట సభల ప్రతినిధులను ఈ కుటుంబమే నిర్ణయిస్తుందని గ్రామస్థులు భావిస్తుంటారు. వీళ్ళ కుటుంబ పెద్దకు చదువు లేనప్పడికి, తర్వాత తరాల వారిని మాత్రం విద్యావంతుల్ని చేసారు. 

ఒక పూట ఆహారం కోసం పాత తరహా వంట చెరకు

వాడే 13 స్టవ్ లపై 50 చపాతీలు, 25 కేజీల కూర, తయారు చేస్తుంటారు. ఈ పని కోసం ఇంట్లోని మహిళలు తెల్లవారుజామున 4:00 గంటల నుంచి పని ప్రారంభిస్తారని సభ్యులు తెలియచేస్తున్నారు. 

ఎవరో ఒకరి జన్మదినం, వివాహ వేడుకలు, లాంటి వేడుకలతో ప్రతి రోజూ ఆ ఇల్లు జాతర వాతావరణాన్ని తలపిస్తుంది.  కేవలం ఒకరిద్దరు పిల్లలకే పరిమితమైన నేటి

కుటుంబ వ్యవస్థకు పూర్తి గా భిన్నంగా ఒకే ఇంట్లో 185 మంది  కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బంది లేకుండా నివాసం ఉండడం ఒక విచిత్రం గానే భావించాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam