DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కడు పేదవారికి గూడు ఇచ్చిన మహా నేత, అటల్ జి : ఎంఎల్యే విష్ణుకుమార్ రాజు

విశాఖపట్నం, ఆగస్టు 17 ,2018 (DNS Online): దేశ వ్యాప్తంగా ఉన్న కడుపేదవారికి కూడా నివాసయోగ్యమైన గూడు ( ఇల్లు) ఉండాలి అనే సంకల్పంతో వాల్మీకి అంబెడ్కర్ గృహ సముదాయం ( వాంబే

గృహాలు) దేశ వ్యాప్తంగా నిర్మించి అందరి పాలిట ఆశాజ్యోతిగా వెలిగిన మహనీయుడు అటల్ బిహారి వాజపేయి అని విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు పి విష్ణుకుమార్

రాజు అన్నారు. విశాఖపట్నం లోని ఉత్తర నియోజకవర్గం లోగల తమ  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ లో నిర్వహించిన అటల్ జి సంస్మరణ లో ఆయన రాజనీతిజ్ఞతను గుర్తుచేసుకున్నారు. శ్రీకాకుళం

జిల్లా ఇచ్చాపురం నుంచి, నెల్లూరు జిల్లా తడ వరకూ సుమారు వెయ్యి కిలోమీటర్ల జాతీయ రహదారిని నాలుగు రోడ్ల రహదారిగా తయారు చేసి అత్యంత ప్రాధాన్యత కల్పించారన్నారు.

తద్వారా నేటికీ వేలాది భారీ వాహనాల ద్వారా ఎంతో వ్యాపార వాణిజ్య లావాదేవీలు సాగుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల వారితో సైతం తనవాడు అనిపించుకునే విధంగా

దాదాపు అర్ధ శతాబ్దం పాటు భారత దేశ అత్యంత ఉన్నత చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన ఘనత ఈయనకు మాత్రమే దక్కిందన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయినప్పటికీ

ప్రజల హృదయాల్లో నేటికీ ఉన్నతంగానే ఉన్నారన్నారు. ఒక మంచి నేతగా, మంచి మిత్రునిగా లాలకిషన్ అద్వానీ తో ఏర్పడిన బంధం ఎన్నో బ్రహత్తర పథకాలకు రూపకల్పన

జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నగర ఉపాధ్యక్షురాలు దీపికా, ఉత్తర నియోజక వర్గ సమన్వయకర్త సురేష్ సొమయాజుల తదితరులు పాల్గొని దివికేగిసిన మహనీయునికి ఘన

నివాళి అర్పించారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #bjp  #visakhapatnam  #vizag  #vizag bjp  #atal bihari vajpayee #rememberance  #visakha north MLA  #vishnu kumar raju  #MLA vishnu

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam