DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామేశ్వరం నుంచి చెన్నైవరకూ ద్రావిడ సింహం అన్నామలై పాదయాత్ర

*28 న అమిత్ షా చే ప్రారంభం, 5 నెలలు -  234 నియోజక వర్గాలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 24, 2023 ( DNS Online):* ప్రస్తుత భారత దేశ రాజకీయాల్లో సంచలనం తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై మరొక sanchalana కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 28 న టెంపుల్ సిటీ gaa ఖ్యాతిగాంచిన

రామేశ్వరం నుంచి తమిళనాట పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఎన్ మన్ ఎన్ మక్కల్ peruto జరుగుతున్నా ఈ యాత్రను  జూలై 28న రామేశ్వరం లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు.

పాదయాత్ర రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలను కవర్ చేసి జనవరి 11న చెన్నైలో ముగుస్తుంది.

ఈ యాత్ర రూట్ మ్యాప్ ను బిజెపి

ప్రతినిధులు ఇప్పడికే తమిళ నాడు డిజిపి శంకర్ జివాల్‌ ను కలిసి వివరించారు. అన్నామలై కు తగిన భద్రతను కల్పించవలసినదిగా కోరడం జరిగింది. 

ఈ యాత్ర ఈ నెల ఏప్రిల్‌లో తిరుచెందూరు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పొరుగున ఉన్న కర్ణాటకలో ఎన్నికల కారణంగా వాయిదా పడింది.

తమిళనాడు తో పాటు

దేశ వ్యాప్తంగా  అన్నామలై కి భారీ ఆదరణ ఉండడంతో ర్యాలీ ప్రారంభ రోజున కనీసం 1.5 లక్షల మంది వస్తారని పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ నాడు లో అధికారంలో ఉన్న డిఎంకె పార్టీ నేతల అవినీతి జాబితా ను డీఎంకే ఫైల్స్ పేరుతొ ఆధారాలతో విడుదల చేసి అన్నామలై దేశ వ్యాప్త సంచలనంగా మారారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో

పూర్తి స్థాయి ఆధారాలు ప్రదర్శించడంతో అధికార పార్టీ విలవిలలాడిపోయింది. 

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కి అంత ప్రాధాన్యత లేకపోవడంతో ప్రస్తుత తరుణంలో అన్నామలై ఒక ఆశాదీపం లా కనపడుతున్నారు.   
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam