DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తమిళ నాట రామేశ్వరం లో అమిత్ షా సాక్షిగా తోలి అడుగు పడింది

*రామేశ్వరం నుంచి చెన్నైవరకూ ద్రావిడ సింహం అన్నామలై పాదయాత్ర* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 28, 2023 ( DNS Online):* ప్రస్తుత భారత దేశ రాజకీయాల్లో సంచలనం తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై మొదలు పెట్టిన పాదయాత్ర కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా

ప్రారంభించారు. రామేశ్వరం నుంచి మొదలైన ఈ యాత్ర మొత్తం 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రయాణిస్తూ జనవరి 11 నాటికి చెన్నై లో ముగుస్తుంది.  ఎన్ మన్ ఎన్ మక్కల్ పేరుతొ  జరుగుతున్నా ఈ యాత్రను  జూలై 28న రామేశ్వరం లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ తమ

వారసులను ముఖ్యమంత్రులుగాను, ప్రధానులు గాను ఆయా సీట్లలో కూర్చోపెట్టాలి అని అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం దేశ యువతను అత్యున్నత స్థానంలో కూర్చోపెట్టాలి అని అవిశ్రాంతంగా రోజుకు 20 గంటలకు పైగా కృషి చేస్తున్నారన్నారు. అన్నామలై tamil నాడు కు మాత్రమే పరిమితం కాదని, ఆయన

స్ఫూర్తిగా ఇతర రాష్ట్రాల్లో సైతం నాయకులూ ఎదుగుతున్నారన్నారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈయాత్ర ప్రారంభ సభ తమిళ నాడు లో ఒక బృహత్తర మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. 

తమిళ్ నాడు లో అధికారంలో ఉన్న డిఎంకె పార్టీ నేతల అవినీతి జాబితా ను డీఎంకే ఫైల్స్ పేరుతొ ఆధారాలతో విడుదల చేసి అన్నామలై దేశ

వ్యాప్త సంచలనంగా మారారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో పూర్తి స్థాయి ఆధారాలు ప్రదర్శించడంతో అధికార పార్టీ విలవిలలాడిపోయింది. 

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కి అంత ప్రాధాన్యత లేకపోవడంతో ప్రస్తుత తరుణంలో అన్నామలై ఒక ఆశాదీపం లా కనపడుతున్నారు.   
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam