DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మనం తినే ఆహారం పండించే రైతులకు ధన్యవాదాలు తెలుపుదాం : ఆడారి కిషోర్

*పిల్లలతో మామేకమైన కర్షక దేవో భవ అధ్యక్షులు ఆడారి కిషోర్ వినతి* 
 
*విశాఖపట్నం, ఆగస్టు 02 , 2023 ( DNS Online):* సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఆహారాన్ని పండించి, అందిస్తున్న రైతులకు ప్రతి ఒక్కరం ధన్యవాదాలు తెలుపుదామని కర్షక దెవొ భవ ప్రాజెక్ట్ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ విద్యార్థులకు సూచించారు. కర్షక దేవో

భవ ప్రచార కార్యక్రమం లో భాగంగా ఐదవ రోజు బుధవారం విశాఖ లోని నరసింహ నగర్ లోని శ్రీ షిర్డీ సాయి స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో మమేకమై రైతుల విలువలను తెలియచేసారు. ఈ సందర్బంగా వారికీ రైతులు గొప్పదనం, వారి జీవన విధానం తెలియచేసారు. స్కూల్ విద్యార్థుల పెద్దల్లో రైతులుగా ఉన్న విద్యార్థులకు పిల్లలతో చప్పట్లు

కొట్టించారు. వారికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పవలసిందిగా సూచించారు. మనం తినే ప్రతి ఆహారాన్ని ఎంతో కష్టపడి పండిస్తున్నారని, వాటిని వృధా చేయరాదన్నారు. పంటలు పండించే సమయంలో ఎదురయ్యే సమస్యలు, ఒక్కరోజు పొలం పనులు చెయ్యకపోతే జరిగే అనర్ధాలు తెలియచేసారు. ముఖ్యంగా కొరోనా కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసిన

ఏకైక శ్రామికులు రైతులు మాత్రమేనన్నారు. 

అనంతరం కర్షక దేవోభవ ప్రాజెక్ట్ లక్ష్యాలను విద్యార్థులకు, వివరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam