DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ ప్రజలందరికి ఆహారం అందిస్తున్న కర్షకులు దైవ స్వరూపులే :ఆడారి కిషోర్

*వినేక్స్ కళాశాల విద్యార్థులతో 6 వ రోజు కర్షక దేవో భవ అవగాహన* 
 
*విశాఖపట్నం, ఆగస్టు 03 , 2023 ( DNS Online):* దేశ ప్రజలందరికి ఆహారాన్ని పండించి, దేశానికి జీవనం కలిగిస్తున్న కర్షకులు సాక్షాత్తు దైవ స్వరూపులేనని, కర్షక దెవొ భవ ప్రాజెక్ట్ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ తెలియచేసారు. 
కర్షక దేవో భవ ప్రచార

కార్యక్రమం లో భాగంగా ఆరవ ఐదవ రోజు గురువారం విశాఖ లోని ద్వారకానగర్ లోని వినేక్స్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు ఆహారం తినే ముందు సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఆహారాన్ని పండించి, అందిస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ అని ధన్యవాదాలు

తెలుపుదామన్నారు. 
ఎంతమంది విద్యార్థులు రైతు కుటుంబాల నుంచి వచ్చారు అని అడగగానే ఎక్కువమంది తాము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చామని, తమ తండ్రి, తాత లు వ్యవసాయం చేస్తున్నారు చెప్పడంతో వీళ్ళందరి కోసం అందరితో ధన్యవాదాలు చెప్పిస్తూ చప్పట్లు కొట్టించారు.  
మనం ప్రతి రోజు తినే ఆహారం ఎవరో ఒక రైతు పండించినదేనని, ఆహారం

వృధా చెయ్యవద్దు అని సూచించారు. రైతుల విలువలను తెలియచేస్తూ, వారి జీవన విధానం తెలియచేసారు. 
వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలని సూచించారు.  
అనంతరం కర్షక దేవోభవ ప్రాజెక్ట్ లక్ష్యాలను విద్యార్థులకు, వివరించారు. ఈ కార్యక్రమం లో కోచింగ్ కేంద్రం ప్రిన్సిపాల్, ఇతర

సిబ్బంది, కర్షక దేవోభవ ప్రాజెక్ట్ ప్రతినిధులు శ్రీధర్, ముకేశ్, మహేష్, తదితరులు  పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam