DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 16 నుంచి విశాఖ లో ఉత్తరాంధ్ర పురోహిత క్రికెట్ టోర్నీ

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఆగస్టు 14, 2023 (DNS Online):* సెప్టెంబర్ 16, 17 తేదీల్లో విశాఖపట్నం వేదికగా  ఉత్తరాంధ్ర పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర కన్వీనర్ ఏలూరు వెంకట రమణ ( రాజేష్ ) శర్మ తెలియచేసారు. పోటీల వివరాలను సోమవారం డిఎన్ఎస్ మీడియా కు

వివరించారు. నిరంతరం పౌరహిత్యం, వైదిక క్రియలతోను బిజీగా ఉండే పురోహితులకు కొంత ఉల్లాసం కల్గించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నం లోని ఆరిలోవ లో గల మైదానం లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర కు చెందిన ఆరు జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయన్నారు. వీరితో పాటు విశాఖ పట్నం బ్రాహ్మణా

పాత్రికీయ సంఘం నుంచి క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారన్నారు. నిర్వాహక కమిటీ లో సోమయాజులు విజయ్ కుమార్ శర్మ, నెమ్మలూరి శివ గణేష్ శర్మ తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ పోటీలకు మీడియా పార్టనర్ గా డిఎన్ఎస్ మీడియా వ్యవహరిస్తోందన్నారు. క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇవ్వడం

జరిగిందన్నారు. సుమారు 100 మంది కి పైగా పురోహితులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పూర్తి స్థాయి క్రికెట్ నిబంధనలతో జరిగే ఈ పోటీల్లో సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రత్యేక ఆకర్షణగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే జట్ల వివరాలు, ఇతర నిబంధనలు త్వరలోనే

తెలియచేస్తామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam