DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అపర త్యాగరాజు అన్నవరపు కు నాద విద్యా భారతి పురస్కారం

*సెప్టెంబర్ 2 నుంచి కళా భారతి జాతీయ సంగీత నాటకోత్సవాలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖ పట్నం, ఆగస్ట్ 31, 2023 (డి ఎన్ ఎస్): ప్రముఖ వాయులీన విద్వాంసులు, అపర త్యాగరాజు పద్మశ్రీ, డాక్టర్ అన్నవరపు రామస్వామి కు నాద విద్యా భారతి పురస్కారం అందించనున్నట్టు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ,

కళాభారతి సంస్థ కార్యదర్శి జి అర్ కే ప్రసాద్ ( రాంబాబు ) తెలిపారు. గురువారం కళా భారతి ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ గత 36 సంవత్సరాలుగా అనేకరకాల కళాకారులను ఆహ్వానించి కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు సహాయం చేస్తూ వస్తోందన్నారు.  
37 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా

సెప్టెంబర్ నెల 2 వ తేదీ నుంచి 7 వరకూ ప్రఖ్యాతిగాంచిన సంగీత కళాకారుల ప్రదర్శనలు జరుగుతాయన్నారు.

ఈ సంవత్సర వార్షికోత్సవాలను పురస్కరించుకుని జాతీయ సంగీత, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారం  గా బహుమతి లక్ష రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం నూతన వస్త్రాలు, వాటితోపాటు రూ. 2 లక్షలు

విలువ చేసే స్వర్ణ కమలం, ప్రతిష్టాత్మకమైన "నాద విద్యా భారతి" బిరుదు తో వారిని సత్కరించడం జరుగుతుందన్నారు. 

సెప్టెంబర్ 2 వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు జరుగుతుందని, 

గత 9 దశాబ్దాల కు పైగా వేలాది మంది శిష్య ప్రశిష్యులను తయారు చేసి, సంగీత సరస్వతికి దేశ, విదేశాల్లో నీరాజనం

అందిస్తున్నారని తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ సభకు  ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉప రాష్ట్రపతి డా. ఏం. వెంకయ్య నాయుడు,   నావికా దళ వైస్ అడ్మిరల్ జి. శ్రీనివాసన్ లు హాజరుకానున్నట్టు తెలియచేశారు.
 
సభ అనంతరం పురస్కార గ్రహీత రామస్వామి సుమారు 2 గంటల సమయం సంగీత కచేరీ నిర్వహించ నున్నారు.
 సభా ప్రారంభ వేడుకలను

సంస్థ అధ్యక్షులు, కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు రూ.  2.5 లక్షలు నగదు అందించారన్నారు. ఈ అవార్డు లో భాగంగా రమారమి రూ 2  లక్షల రూపాయలు విలువ చేసే స్వర్ణకమలం ని వైభవ్ జ్యువెలర్స్ అధిపతులు అందిస్తున్నట్టు తెలిపారు.  గత  21 సంవత్సరాలు గా వీరే ప్రయోజకులు ఉన్నారన్నారు.

రెండో రోజు  3/9/2023 న  గాత్ర

విద్వాన్, చెన్నై వాస్తవ్యులు టి ఎం కృష్ణన్  సంగీత కచేరీ,    
మూడవ రోజు 4/9/2023 నాడు భాగవతుల వెంకట రామ శర్మ బృందం చే పద్మావతి పరిణయం, కూచిపూడి నృత్యం, ";

నాలుగవ రోజు 5.9.2023 న హిందుస్తానీ ట్రిపుల్ బంది ( త్రిగళం) తారీఖున ప్రముఖ కచేరీ, ఉంటుందన్నారు.ఐదో రోజు 6/9/2023 నాడు కర్ణాటక సంగీత విద్వాంసులు, *గుమ్ములురి శారదా

సుబ్రహ్మణ్యం* గాత్ర కచేరీ,
ఆరవ రోజున  7/2023 నాడు ప్రముఖ పౌరాణిక పద్య నాటకం శ్రీ కాళహస్తీశ్వర సౌజన్యం ఉంటుందన్నారు.

ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న  ఎస్.ఆర్.కె ఇన్ఫ్రా  ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైభవ్ జ్యువెలర్స్,  సి ఎస్ రాజు, డి.ఎస్.ఎన్ రాజు అండ్ లక్ష్మీకాంతం, ది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్,

కంకటాల సిల్క్స్,  మహామారుతి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాముద్రిక సాఫ్ట్వేర్, ఎం ఆర్ సి అధిపతి కే రాంబాబు తదితరులకు  ధన్యవాదాలు. తెలిపారు.

 సంగీతం, నాటకం, సాహిత్యం, నృత్యం ఇలాంటివన్నీ మరుగున పడి పోకుండా ప్రోత్సహించే సదుద్దేశంతో, గురువుల దగ్గర ముఖతః గానే కాకుండా చూసి కూడా చాలా నేర్చుకోవాల్సి

ఉంటుందని ఈ జనరేషన్ వాళ్ళు అందరికీ అవకాశం కల్పించాలని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్ని కార్యక్రమాలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ అందరిని ఆహ్వానిస్తోందన్నారు.

గురువులు, శిష్యులు ప్రశిష్యులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో విచ్చేసి చూసి ఆనందించి విజయవంతం చేయాలని

కోరుతున్నారు.

అంతకు ముందు కార్యక్రమాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు ఎం ఎస్ ఎన్ . రాజు, కార్యదర్శి  గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణ ప్రసాద్, మల్లిక మనోజ్ గ్రంధి, మోహన్ దాస్ విడుదల చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam