DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ బెస్ట్ టీచర్ కి ఆడారి కిషోర్ కుమార్ ఆత్మీయ సత్కారం

*ఉమా గాంధీ కు మిషన్ కర్షక దేవో భవ జాతీయ చైర్మన్ సత్కారం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, ఆగస్ట్ 31, 2023 (డి ఎన్ ఎస్):* జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన ఉమా గాంధీ కు మిషన్ కర్షకదేవోభవ ప్రాజెక్ట్జా తీయ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ అభినందనలు తెలియచేసారు. విశాఖపట్నం లోని శివాజీ

పాలెం లో గల గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఉమా గాంధీ ను గురువారం కర్షకదేవోభవ బృందం  కలిసి, సత్కరించారు. ఈ సందర్భంగా ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ విశాఖ కీర్తి ని జాతీయ స్థాయిలో పెంపొందింపచేసిన అత్యుత్తమ ఉపాధ్యాయురాలు అందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.

చిన్న పిల్లకు కథలు, పద్యాలూ, ఆంగ్ల రైమ్స్, తదితర అంశాలను వినూత్న రీతిలో మాతృభాషలోకి తర్జుమా చేసి, ఆసక్తికరంగా తెలియచేస్తూ, పిల్లల్లో మరింత చైతన్యాన్ని కల్గించడం ఆమె ప్రత్యేకత అన్నారు. ఇదే అంశం ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. పదవి విరమణ తదుపరి కూడా విద్యార్థులకు వారి సేవలు కొనసాగించేలా కృషి

చెయ్యాలని కిషోర్ కుమార్ అభిప్రాయపడ్డారు. 

రైతుల అభ్యున్నతి కోసం తాము చేస్తున్న తమ మిషన్ కర్షక దేవోభవ ప్రాజెక్ట్ బృందానికి ఉమా గాంధీ అందిస్తున్న సలహాలు, సూచనలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam