DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ అరాచక పాలనకు ఎదురొడ్డి పోరాడుతున్నాం : అయ్యన్న 

*ఈ రాక్షస పాలనలో నోరు విప్పడం మహా నేరంగా ఉంది : అయ్యన్న*

*విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసుల అదుపులో అయ్యన్న, విడుదల* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, సెప్టెంబర్ 01, 2023 (డి ఎన్ ఎస్):* వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను ఎదురొడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కు ఎన్ని కష్టాలైనా

ఎదుర్కొని నిలబడతామని, వెనకడుగు వేయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. శుక్రవారం విశాఖ విమానాశ్రయం వద్ద ఆయన్ని కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని, అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్గేట్ వద్ద 41(A) నోటీసు ఇచ్చి పోలీసులు వేంపాడు టోల్ గేట్ వద్ద విడుదల చేయడం

జరిగినది. అక్కడే ఆయన విలేకరుల సమావేశంలో ఘటనను వివరించారు. అనంతరం ఈ ప్రహసనాన్ని అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో తన ఇంటి కి చేరుకున్నారు. 

రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన లో ఎవరైనా నోరు విప్పడం మహా నేరంగా ఉందన్నారు. దీని నుండి ప్రజలను కాపాడుతామని, ప్రభుత్వాన్ని మార్చడంనికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తనను

విశాఖ విమానాశ్రయం నుంచి పోలీసులు జీపులో తీసుకు వెళ్లారని, తనను అరెస్టు చేయమని సిఐ కి ఎవరో కాల్ చేశారన్నారు. తమతో గన్నవరం పోలీస్ స్టేషన్ కు రావాలన్నారు. తక్షణం తానూ 41 నోటీసు ఇవ్వమని అడిగానన్నారు. అప్పుడికప్పుడు రోడ్డు ప్రక్కనే బండి ఆపి, తయారు చేసి ఇచ్చారని, నోటీసు అందిన పది రోజులకు కలవాలని చెప్పారన్నారు. 41 A నోటిసులు

ఇచ్చి అనకాపల్లి జిల్లా వెంపడు టోల్ గేట్ వద్ద విడిచిపెట్టారన్నారు.

జగన్ గురించి నేను ఎటువంటి వివాస్పద వ్యాఖ్యలు చేయలేదని, ఆతను ఎదుర్కొంటున్నసిబిఐ కేసులు గురించే చెప్పానన్నారు. 

కాగా యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గన్నవరం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై

కృష్ణ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam