DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళలకు పునరుజ్జీవం రావడానికి కళలను పాఠ్యాంశాల్లో చేర్చాలి

*పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు.*

*వైభవంగా వీఎండీఏ కళా భారతి జాతీయ సంగీత నాటకోత్సవాలు* 

*పద్మశ్రీ అన్నవరపు కు నాద విద్యా భారతి పురస్కారం ప్రదానం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, సెప్టెంబర్ 02, 2023 (డి ఎన్ ఎస్):* భారత దేశం సంగీత, కళలకు అనాదిగా విశ్వగురు

స్థానంలో నిలిచిందని, దాన్ని తిరిగి పునరుజ్జీవం చేయడానికి విద్య  విధానం లో సంగీత, కళలను ప్రవేశ పెట్టాలి అని, భారత పూర్వ ఉప రాష్ట్రపతి డా ఎం. వెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు. శనివారం విశాఖ లోని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి సంస్థ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న వీఎండీఏ కళా భారతి జాతీయ సంగీత నాటకోత్సవాలను

ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలకు వయసుకు సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మాతృ భాషలోనే మాట్లాడాలని, మాతృ భాష మాత్రమే జీవితాన్ని అందిస్తుందన్నారు. ఇంతమంచి  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళా భారతి , వి ఎం డి ఏ కమిటీ అభినందనీయులు అన్నారు. 

తనకు తెలుగు భాషలోనే

మాట్లాడడం ఇష్టమని, అందుకే ఆహుతుల్లో కూడా తెలుగు మాట్లాడే వారే అధికంగా ఉంటారన్నారు. స్వచ్ఛమైన తెలుగు లో మాట్లాడడం ఆనందంగా ఉంటుందన్నారు.

అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన వైస్ అడ్మిరల్ జి. శ్రీనివాసన్, సంస్థ అధ్యక్షులు ఎం ఎస్ ఎన్ రాజు, కార్యదర్శి. జి అర్ కే ప్రసాద్, తదితరులు ప్రముఖ వాయులీన విద్వాంసులు,

పద్మశ్రీ, డాక్టర్ అన్నవరపు రామస్వామి కు నాద విద్యా భారతి పురస్కారం అందించారు.

వీరికి పురస్కారం తో లక్ష రూపాయలు నగదు, స్వర్ణ కమలం సమర్పణ చేశారు. అపర త్యాగరాజుగా కొనియాడబడుతున్న రామస్వామి, నాటి తరం నుంచి నేటితరం వరకూ జ్ఞాన రీత్యా, వయసు రీత్యా అత్యున్నత పెద్దలు. కొన్ని వందలమంది శిష్య ప్రశిష్యులను అందించిన

అన్నవరపు రామస్వామి సంగీత సరస్వతి మంగళంపల్లి బాలమురళి కృష్ణ సహాధ్యాయులు అన్నారు.

అవార్డు గ్రహీత పద్మశ్రీ అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ.. కర్ణాటక సంగీతానికి అంత ఆదరణ అభించడానికి కారాం తెలుగు భాష మాత్రమే నన్నారు. ఇతర భాషల్లో తక్కువ అక్షరాలు ఉన్నయనీ, తెలుగు భాషలో మాత్రమే 50 కి పైగా అక్షరాలు ఉన్నాయన్నారు.

ఎన్నో రాగాలు, కీర్తనలు లభించాయని తెలిపారు. ఈ రోజు జరిగిన సమ్మానం సంగీత సరస్వతి కి, తన గురువులకు జరిగిందన్నారు.

37 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ నెల 2 వ తేదీ నుంచి 7 వరకూ జరిగే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

సభ అనంతరం  అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామి సంగీత కచేరీ నిర్వహించవలసి

ఉండగా, తమ శిష్యులు మోదుకూరి సుధాకర్ గాత్రా కచేరీ కి, ఫాల్గుణ వైలిన్ పైన, ఘటం పై హరిబాబు, సహకారం తో సంగీత కచేరీ నిర్వహించారు. 

కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని, రామస్వామి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam