DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాస్త్ర రంగం గురించి వేదాల్లో వివరణ :త్రిదండి అహోబిల జీయర్ స్వామి

*ఇస్రో శాస్త్రవేత్త రాజేష్ కు చిన్నజీయర్ ఆశ్రమం ఆత్మీయ సత్కారం*

*సీతానగరం ఆశ్రమ సభకు విశిష్ట అతిధి గా ఆడారి కిషోర్ కుమార్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విజయవాడ, సెప్టెంబర్ 5, 2023 ( డి ఎన్ ఎస్) : శాస్త్ర సాంకేతిక రంగం గురించి వేద వాఙ్మయం తెలియ చేసిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త  త్రిదండి

అహోబిల రామానుజ జీయర్ స్వామి తెలియచేశారు. మంగళవారం చిన్న జీయర్ స్వామి సీతానగరం ఆశ్రమం లో ఇస్రో నిర్వహించిన చంద్రయాన్ 3 లో కీలక సభ్యునిగా భాద్యతలు వహించిన శాస్త్రవేత్త ప్రాజెక్ట్ మేనేజర్ లీడ్ ఇంజనీర్ ముంతా రాజేష్ కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ విజయ కీలాద్రి క్షేత్రంలో చాతుర్మాస్య దీక్షా

నిర్వహిస్తున్నస్వామి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేద విజ్ఞానం ఎన్నో రహస్యాలు సమాధానం చెప్తోందని, అయితే దాన్ని గ్రహించే శక్తి మానవ సమాజానికి ఉండాలన్నారు. అంతరిక్షంలో జరిగే పలు అంశాలను భూమిపై ఉండే ఋషులు, సిద్దులు తమ తపోశక్తితో గ్రహించేవారన్నారు. నేడు శాస్త్రవేత్తలు తమ మేధాశక్తిని వినియోగించి సమాజానికి

అందిస్తున్నారన్నారు. 

ఈ సందర్భంగా పలు విద్యా సంస్థల విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాజేష్ సవివరంగా సమాధానం అందించారు.  చంద్రయాన్  ప్రయోగం లక్ష్యం, సాధించ బోతున్న విజయాలు అందరి లోనూ స్ఫూర్తిని కల్గించనున్నాయన్నారు. అంతకు ముందు జీయర్ స్వామీ శిష్యులు, వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
 


కార్యక్రమంలో విశిష్ఠ అతిధి గా పాల్గొన్న మిషన్ కర్షక దేవోభవ ప్రాజెక్ట్ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. రాజేష్ లాంటి మేధావులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారుకావాలని అభిలషించారు. ఆధ్యాత్మికవేత్తలు

అందిస్తున్నఆశీస్సులు ఫలితంగా ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతం అవుతున్నాయన్నారు. 

చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నా ఎన్నో కార్యక్రమాలు అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. నేత్ర విద్యాలయ ఒక మహోన్నతమైన అద్భుతం అన్నారు. వేద

పాఠశాలల నిర్వహణ ద్వారా సనాతన ధర్మ రక్షణ జరుగుతోందన్నారు. సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా సమాజంలోని సామాన్యులను కూడా భాగస్వాముల్ని చేయడం అద్భుతమన్నారు. 

కార్యక్రమం లో జీయర్ స్వామీ ఆశ్రమం వాసులతో పాటు, విజయ కీలాద్రి క్షేత్రం నిర్వాహకులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, నగర ప్రముఖులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam