DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోపాలకునికి ఇష్టమైనవి పాడి, పంట, ఆడారి కిషోర్ కుమార్

*కృష్ణాష్టమి వేడుకల్లో కర్షక దేవోభవ 41 వ రోజు అవగాహనా సదస్సు*

సికింద్రాబాద్, సెప్టెంబర్ 7, 2023 (డిఎన్ఎస్): దేశ విదేశాల్లో సనాతన హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయం వద్ద 41 వ రోజు కర్షక దేవోభవ అవగాహన చేపట్టడం జరిగింది. గురువారం సికింద్రాబాదు లో గల అంతర్జాతీయ కృష్ణ ప్రచార

సంస్థ నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకల్లో మిషన్ కర్షక దెవొ భవ బృందం పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాతీయ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గోపాల కృషునికి అత్యంత ఇష్టమైనవి పాడి, పంట అని, వాటిని నిర్వహించేవారు రైతులే నన్నారు. కృష్ణుని జన్మదిన వేడుకల్లో ఆయనకి ఇష్టమైన పాడి పంటల గురించి చర్చించు కోవడం

అదృష్టమన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు రైతుల పరిశ్రమను తెలియచేసారు. రోజు తినే అన్నం, ఆహారం, మధుర పదార్ధాలు, పాలు, పెరుగు, నెయ్యి, తదితర ముడి పదార్ధాలు రైతులు శ్రమించి అందించేవేనన్నారు. ఆహారాన్ని వృధా చెయ్యవద్దని, ఈమాత్రం ఆహారం కూడా లభించని వారు సమాజంలో ఎందరో ఉన్నారన్నారు. రైతుల పరిశ్రమను గౌరవిస్తూ, ఖాళీ

సమయాల్లో వారికి సహకారం అందించవలసిందిగా కోరారు. భక్తులకు తమ మిషన్ కర్షక దెవొ భవ లక్ష్యాన్ని వారికి తెలియచేసారు. 

సికిందరాబాద్ జిల్లా భారతీయ జనతా యువమోర్చ ఉపాధ్యక్షులు భరత్ తాటి నిర్వహణలో ఈ అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాష్టమి వేడుకల్లో

పాల్గొన్న భక్తులు పాల్గొని ఈ బృందాన్ని అభినందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam