DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సనాతనం విలువ తెలుసుకుని హిందూధర్మం వైపు కేరళ పాస్టర్ అడుగు 

*శబరిమలై వెళ్లేందుకు మండల దీక్ష స్వీకారం చేసిన రేవ్ మనోజ్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం / తిరువనంతపురం, సెప్టెంబర్ 11, 2023 (డి ఎన్ ఎస్):* ఇటీవల సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం అంటూ హైందవ ద్వేష అసురులు ప్రకటనలు చేస్తున్న తరుణంలోనే అందరికి మతి భ్రమించే ఘటన కేరళలో జరిగింది. క్రైస్తవం

అధికంగా ఉన్న కేరళలోని ఒక క్రైస్తవ పాస్టర్ మనోజ్ కేజీ హిందూ ధర్మం స్వీకరించి, అయ్యప్ప దీక్ష చేపట్టడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే. . .
తిరువనంతపురం జిల్లాకు చెందిన ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని పాస్టర్ మనోజ్ కె జి, సనాతన ధర్మం విలువ, ప్రాభవం తెలుసుకుని, మరింత లోతైన అధ్యయనం చేసేందుకు తన

ఉద్యోగాన్ని విడిచిపెట్టి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అయ్యప్ప మాల ధరించి మండలం రోజులు (41 రోజులు) శ్రద్దగా దీక్ష కొనసాగించి సెప్టెంబర్ 20 న శబరిమలై అయ్యప్ప ఆలయానికి వెళ్లనున్నారు. 

అయితే ఈ ఘటన కేరళ లోనే కాక మొత్తం క్రైస్తవ సంస్థల్లో కలకలం రేపింది. దీంతో అతనిపై, అతని కుటుంబం పై ఎన్నో విమర్శలు గుప్పించారు,

హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అన్నింటికీ అతని ఏంతో సానుకూలంగా సమాధానం ఇచ్చాడు. తానూ ఎవరికీ బద్ధుణ్ణి కాదని, అందుకే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టు ప్రకటించారు. ప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేయడానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల దీక్ష పాటించడం కోసం తన చర్చి లైసెన్స్‌ను తిరిగి

ఇచ్చాడు.

తానేమీ తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నాని, క్రైస్తవం విషయంలో నేను చేసినట్లే హిందూ ధర్మాన్ని దాని ఆచార వ్యవహారాలకు మించి అర్థం చేసుకోవడమే నా ఉద్దేశం అన్నారు. విమర్శలు చేయడం కంటే ధర్మంలో ఏమి చెప్పారో తెలుసుకోవడం ప్రధానం అన్నారు. 

ఈయన తీసుకున్న నిర్ణయాన్ని అతని కుమార్తె మద్దతు

ప్రకటించారు. మనోజ్ గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసేవారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam