DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ బ్రాహ్మణా పురోహితుల క్రికెట్ పోటీల విజేత వశిష్ఠ వారియర్స్

*దేశ సుభిక్షం కోసం ముగింపు సభలో క్రీడాకారులచే వేదాశీర్వచనం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*(విశాఖ పట్నం,14 సెప్టెంబర్, 2023  (DNS Online ):* విశాఖపట్నం లోని ఆరిలోవ లో గల పినాకిల్ ఆసుపత్రి వెనుక మైదానంలో రెండు రోజుల పాటు పురోహిత క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా వశిష్ఠ వారియర్స్ జట్టు నిలిచింది. శ్రీ

సీతంరాజు సుధాకర్ బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ పేరుతొ జరిగిన ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ గురువారం జరిగింది. వశిష్ఠ వారియర్స్ జట్టు భరద్వాజ జట్టు పై 63 పరుగుల తేడాతో గెలుపొందింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన వశిష్ఠ వారియర్స్ జట్టు నిర్ణిత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రామ  56 పరుగులు  ( 17 బాల్స్ లో 4 ఫోర్లు,  6

సిక్సలు ) , పవన్ నాట్ అవుట్ 47 పరుగులు ( 20 బాల్స్ లో 2 ఫోర్లు, 5  సిక్సలు ) చేసారు. అన్షు అను 2 వికెట్లు తీసుకున్నారు. బదులుగా బ్యాటింగ్ చేసిన భరద్వాజ జట్టు 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆ జట్టులో పివి పవన్ కుమార్ 20    పరుగులు,  రాజన్ 15 పరుగులు చేసారు. విస్సు, ప్రసాద్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ డి మ్యాచ్

గా పవన్ (వశిష్ఠ వారియర్స్ ) నిలిచారు.
బహుమతి ప్రదానం లో భారత దేశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రజలు  సుభిక్షంగా ఉండాలి అనే సంకల్పంతో శాంతి మంత్రాలూ పఠించారు. 

పురోహితులను ప్రోత్సహించేందుకె . . .

నిత్యం వివిధ వైదిక కార్యక్రమాల్లో మునిగిపోయే బ్రాహ్మణులకు ప్రోత్సాహాన్ని కల్పించేందుకు క్రికెట్

టోర్నమెంట్ నిర్వహించినట్టు నిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు సోమయాజుల విజయ్ కుమార్ తెలిపారు. విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవ సమైక్య సంఘం, ఉత్తరాంధ్ర పురోహిత మిత్రల సంయుక్త  నిర్వహణలో ఈ పోటీలు జరిగాయన్నారు. పాల్గొనే టీమ్ లను సప్త ఋషులు వేదమాత గాయత్రీ ( ఆత్రేయ, భారద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కాశ్యప, జమదగ్ని,

గాయత్రి, శ్రీ వశిష్ఠ )  పేరిట నామకరణం చేశామన్నారు. ఒక్కో ఇన్నింగ్స్ 10 ఓవర్లు చొప్పున, నాకౌట్ విధానం లో పోటీలు జరిగాయన్నారు. 

నిత్యం వైదిక కార్యక్రమాల్లో ఉండే పురోహితులకు ఉల్లాసాన్ని కల్పించాలనే సంకల్పంతో జరిగిన ఈ పోటీలలో పాల్గొన్నవారికి, నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు

తెలిపారు. మొదటి మూడు స్థానాల వారికి బహుమతులతో పాటు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందించారు. 

ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర కన్వీనర్ ఏలూరు వెంకట రమణ నిర్వహణలో శ్రావణ మాసం లో జరిగిన 
వరలక్ష్మి పూజల్లో పోటీలు నిర్వహించామని, విజేతలకు బహుమతి ప్రదానం చేసారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam