DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విహెచ్ పి@ 60, ఈనెల 30 నుంచి తెలంగాణ లో శౌర్య జాగరణ యాత్ర

*తెలంగాణ ప్రచార ప్రముఖ్  పగుడాకుల బాలస్వామి వెల్లడి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం / భాగ్యనగరం,15 సెప్టెంబర్, 2023  (DNS Online ):* హిందూ సమాజాన్ని నిరంతరం జాగృతం చేస్తున్న విశ్వహిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రచార ప్రముఖ్

 పగుడాకుల బాలస్వామి తెలిపారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్నా ఈ షష్టిపూర్తి వేడుకల్లో భాగంగా తెలంగాణాలో ఈనెల  30 నుంచి శౌర్య జాగరణ యాత్ర చేపట్టామన్నారు. అందులో భాగంగా యువతను జాగృతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకూ శౌర్య జాగరణ యాత్ర

నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో యాత్రలు జరుగుతాయన్నారు. దేశం కోసం ధర్మం కోసం యువతను ఆజాగృతం చేయడం.. స్వాతంత్ర సమరయోధుల బలిదానాలను నేటి యువతకు తెలియజేసేందుకు పలు ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. యువతలో దేశభక్తి జాతీయభావాలు నింపేందుకు

జరుగుతున్నఈ యాత్రల్లో  విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జాతీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. దేశ చైతన్యం కోసం జరుగుతున్న ఈ యాత్రలకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.   
    డిజిపి సూచనల మేరకు యాత్ర జరిగే అన్ని జిల్లాల్లోనూ సంబంధిత పొలిసు

అధికారులతో సమన్వయం చేసుకోవడం జరుగుతుందన్నారు. డీజీపీ ని కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర  కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam