DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేనకు మరోసారి గ్లాస్ గుర్తు, కృతజ్ఞతలు తెలిపిన పవన్ 

*(DNS Report: P. Raja, Bureau Chief, Amaravati)*

 *అమరావతి, సెప్టెంబర్ 19, 2023  ( డిఎన్ఎస్):*  జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో

తగిన సీట్లు, ఓట్లు రానందున కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తును రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో 2024 లో జరుగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఇబ్బంది పెడతారనే యోచనతో తమ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేస్తారు అనే ప్రకటన కూడా జనసేన విడుదల చేసింది. అయితే ఎన్నికల సంఘం మరోసారి గాజుగ్లాసు గుర్తు ను తమకే

కేటాయించడం తో జనసేన పార్టీ ఒక కీలక ఇబ్బంది నుంచి బయట పడినట్టు అయ్యింది. 

గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి

జనసేన అభ్యర్థులు సన్నద్ధమైనతరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్రఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం అని అన్నారు.  ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరఫున  కృతజ్ఞతలు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam