DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ పరిస్థితి బ్రిటిష్ నాటి బెయిల్ గా మారింది: తెలుగు శక్తి

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, 20 సెప్టెంబర్, 2023  (DNS Online ):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్  ఎద్దేవా చేశారు. బుధవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ లాంటి బెయిల్ మాదిరిగా ముఖ్యమంత్రి చేతిలో

రాష్ట్ర భవితవ్యం మారిందన్నారు. బ్రిటిష్ ఫాలనలో కూడా ఇంతటి అరాచకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా  పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. వారికి ఇష్టం లేకపోయినా ఒత్తిడితో పనిచేస్తున్నారన్నారు. అనేక కేసులలో ఉపయోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పై వచ్చి పరిపాలన సాగిస్తే  పరిపాలన ఇలాగే

ఉంటుందన్నారు. మరోవైపు మంత్రులు తమ బాధ్యతలను మరిచి ప్రతిపక్ష నేతలను దూషించడమే పనిగా పేరుకున్నారన్నారు. 2024 ఎన్నికలలో  ఓటమి తప్పదనే  విషయం స్పష్టంగా తెలియడంతో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమంగా చంద్రబాబు నాయుడు పై కేసులు పెట్టి  అరెస్టు చేయించారన్నారు. అరెస్టు చేసి జైలులో పెట్టిన తర్వాత సాక్షాలు

సేకరిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఏపీ ఫైబర్, రింగ్ రోడ్డు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ.. మరికొన్ని కేసులను తవ్వే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం -  జనసేన కూటమి175 కి 175 నియోజకవర్గాలలో క్లిన్

స్వీప్ చేస్తుందన్నారు.

ఈ సమావేశంలో తెలుగు శక్తి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam