DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు అరెస్ట్ పై ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా ఆడారి కిషోర్ కుమార్ నిరసన 

*ప్రజాస్వామ్యం కాపాడాలని ఢిల్లీలో 8 రోజులుగా నిరసన ప్రదర్శనలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం / న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21, 2023  (DNS Online ):* ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పిన పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి గాడి లో పెట్టాలి అని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలోనీ ఎర్రకోట సాక్షిగా దేశ

ప్రజల దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. 
గురువారం ఢిల్లీ లోని ఎర్రకోట ఎదురుగా నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తూ రాష్ట్ర పరిస్థితుల పై దేశాధినేతల కు, జాతీయ పార్టీల పెద్దల దృష్టికి తీసుకు

వెళ్లామన్నారు.
ఇప్పడికే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర  సోషల్ జస్టిస్ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్, కార్యాలయాల్లో నేరుగా ఫిర్యాదు చేసినట్టు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. 

తెలుగు దేశం

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కలిసి రాజ్ ఘాట్ వద్ద సమస్యను గాంధీ కి విన్నవిస్తు ఘన నివాళి అర్పించినట్టు తెలిపారు. ఏపిలో పరిస్థితుల పై దృష్టి పెట్టి, చక్కదిద్ద వలసింది గా విన్నవించామన్నారు.  
ఈ పర్యటనలో ఇప్పడికే ఏపీ భవన్ వద్ద, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కూడా చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ వద్ద

నేషనల్ మీడియా పాయింట్ వేదిక గా జాతీయ మీడియాలతో మాట్లాడామని తెలిపారు. 
ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలను జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లేందుకు గత 8 రోజులుగా దేశ రాజధాని హస్తినలో ప్రత్యక్ష నిరసనలు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు నుంచి ఏ ఒక్కరోజు కూడా

రాజ్యాంగ బద్దంగా వ్యవహరించలేదన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ప్రతిరోజూ. ప్రత్యక్ష నరకం అనుభవిస్తూన్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని  పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగానికి లోబడి పని చెయ్యవలసిన అధికారులు రూల్స్ ను ఏనాడో తుంగలోకి

తొక్కారన్నారు.
ప్రతిపక్ష నాయకుడు, *తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడి ను అత్యంత పాశవికంగా అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యడం పై మండిపడ్డారు.* ఏమాత్రం పసలేని, సంబంధం లేని , ఆధారం లేని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ స్కీం  లో చంద్ర బాబు నూ అరెస్ట్ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈయన దార్శనికత ఆధారంగా *సుమారు 5

లక్షల మంది స్కిల్స్ లో శిక్షణ తీసుకుని దేశ విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.* సాక్షాత్తు అభియోగం మోపబడిన సిమెన్స్ సంస్థ అధిపతులే ఈ స్కీం లో ఎటువంటి స్కాం జరగలేదని చెప్పి నా మొండి పట్టుదల తో అధికార పార్టీ వెళ్తోందన్నారు.

వీళ్ళ  ధోరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని మండిపడ్డారు. బాబు పై

జరిగిన కుట్రను ఖండిస్తూ పార్టీలకతీతంగా ముందుకు రావాలని ఢిల్లీ నుండి పిలుపునిస్తున్నామన్నారు.

ఈ పర్యటన లో నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ దళిత జే ఏ సీ అధ్యక్షులు ఆలూరి రాజేష్,  ఢిల్లీ తెలుగు సంఘాల ప్రతినిధులు, పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam