DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ ఫోటో ఎక్స్పో లో అప్పన్నఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కు ఫస్ట్ ప్రైజ్ 

*ఈ పురస్కారం అప్పన్నకు అంకితం : తెంటు శ్రీనివాస్* 

(DNS Report : P. Raja , Bureau Chief , Amaravati )*

*అమరావతి సెప్టెంబర్ 28 (డి ఎన్ ఎస్ ):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక శాఖ, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటో ప్రదర్శ పోటీల్లో సింహాచల క్షేత్రం ఆలయ

ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ కు బంగారు పతాకం, లభించింది. 
ఈ పురస్కారంగా ప్రతిభా పురస్కార్ అవార్డ్ ను అందించారు. 

ఈ నెల సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడ లో జరిగిన వేడుకల్లో శ్రీనివాస్ కు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ

ఆకర్షణ కలిగిన పర్యాటక ప్రాంతాలు, పురాతన, దేవాలయాల విశిష్టతలను తెలిపే ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక ,సాంస్కృతిక శాఖ నిర్వహించిందన్నారు. 

మన పర్యాటక ప్రాంతాలు, ఆలయాల గొప్పదనం దేశవ్యాప్తంగా తెలియపర్చాలనే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహించారన్నారు. 

ఈ పోటీ ల్లో

పాల్గొండేందుకు పురాతన దేవాలయాల కేటగిరిలో అద్భుతమైన సింహాచల క్షేత్రం ఫోటోలను దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఏంటో ప్రాశస్త్యమైన సింహాచల క్షేత్రం ప్రస్ఫుటంగా కనిపించే ఈ ఫోటోలకే గోల్డ్ మెడల్  ప్రతిభా పురస్కార్ అవార్డ్  దక్కిందన్నారు. ఈ విజయాన్ని, బహుమతిని భక్తులు అందరిని నిరాంరాటం కాపాడుతున్న ఆ సింహాద్రి నాధుడు

శ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి పాదాలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. 

రాష్ట్రం నుంచే కాక, వివిధ రాష్ట్రాల నుంచి దరఖాస్తులు లభించాయని, వాటిని ఈ వేడుకల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు. 

ఎంతో కాలంగా సింహాచల క్షేత్రంలో ప్రతి వైదిక కార్యక్రమాన్ని అద్భుతంగా ఫోటోల ద్వారా కోట్లాది మంది భక్తులకు

అందిస్తున్న శ్రీనివాస్ ను DNS మీడియా బృందం అభినందిస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam