DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజాస్వామ్య విలువలు పెంచిన గవర్నర్ కు ధన్యవాదాలు: ఆడారి కిషోర్ కుమార్

 *ప్రజాధనంతో ప్రెస్ మీట్ పెట్టిన సిఐడి చీఫ్ పై విచారణకు గవర్నర్ ఆదేశాలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 20, 2023 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా స్వామ్య న్ని తుంగలోకి తొక్కితూ సిఐడి ప్రెస్ మీట్ లు పెట్టడం పై విచారణకు ఆదేశించిన రాష్ట్ర గవర్నర్ కు తెలుగు దేశం పార్టీ

నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగున్నర ఏళ్లుగా పాలన గతి తప్పిన కేంద్రం అంతగా స్పందించలేదని అన్నారు. అయితే పిచ్చి పాలన పరాకాష్ట కు చేరడంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ను అక్రమంగా 40 రోజులుగా జైల్లో పెట్టారన్నారు. కోర్టు లో కేసు విచారణ లో ఉండగా దాని గురించి బహిరంగంగా మాట్లాడడం కోర్టు ధిక్కరణ

అవుతుందన్నారు. అయితే దీన్ని ఏనాడూ ఖాతరు చేయని అధికార పార్టీ సూచనలతో విచారణ చేస్తున్న రాష్ట్ర సిఐడి చీఫ్, వాదిస్తున్నా అడిషనల్ అడ్వకేట్ జనరల్ లు ప్రెస్ మీట్ లు పీట్టి మరీ కేసు వివరాలు చెప్పడం అధికార దుర్వినియోగం, ప్రజా ధనం దుర్వినియోగం చేయడమే నని అన్నారు. 
దీనిపై గత నెల లో రాష్ట్ర గవర్నర్ కు అందిన ఫిర్యాదు మేరకు

వీరిద్దరి పై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం శుభ పరిణామమని కొనియాడారు. ఈమేరకు రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.

తాము గత రెండు వారాలుగా డెమోక్రసీ ఇన్ డేంజర్ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం అన్నారు.
 
చంద్ర

బాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో తాము నెల రోజుల పాటు చేసిన నిరసనలో ఒకరోజు విజయ్ చౌక్ వద్ద శీర్షాసనం వేసి రాష్ట్రంలో పాలన రివర్స్ లో ఉందని తెలుపామన్నారు., జంతర్ మంతర్, ఏ పీ భవన్, ఇండియా గేట్ నుంచి ఎపి భవన్ వరకూ క్యాండిల్ ర్యాలీ , పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద నిరసనలు చేశామన్నారు.  అక్రమ అరెస్ట్ పై

భారత రాష్ట్ర పతి, ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి, సోషల్ జస్టిస్ మంత్రి, కేంద్ర విజిలెన్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి ప్రత్యక్షంగా ఫిర్యాదు చేశామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam