DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ కి మరో గతిలేకే టైగర్ రాజాసింగ్ పై సస్పెషన్ ఎత్తివేత. . .

*లక్షలాది మంది అభిమానుల పార్టీ మార్పు నిర్ణయమే కారణమా?* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 21, 2023 (డి ఎన్ ఎస్):* భారత దేశ చరిత్రలో సంచలనం టైగర్ రాజాసింగ్. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ యువ నాయకుడు తెలంగాణ హిందూ సమాజానికి దొరికిన ఆణిముత్యం. కోట్లాది మంది హిందువులకు ఏకైక ఆశాదీపం గా

నిలిచినా ఈ యువకుడు హిందువులను కించపరుస్తున్న ఓ విదేశీ హిందూ వ్యతిరేకి హైదరాబాద్ పర్యటనను అడ్డుకున్న కారణంగా బీజేపీ నుంచి వేటు వేశారు. హిందువులకు మద్దతు గా నిలబడి ప్రశ్నించిన కారణంగా ఇతనిపై దేశ ద్రోహం కేసులు పెట్టి జైల్లో వేశారు. అయితే పార్టీ నిబంధనలకు లోబడి ఏనాడూ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టలేదు.

హిందువులకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బీజేపీ సైతం హిందూ ద్వేషం తో భారత్ లో కామిడి షో లు చేస్తున్న పాక్ జోకర్లను అడ్డుకోలేదు. దీంతో కోట్లాది మంది హిందువులు రాజాసింగ్ కు అండగా నిలిచి, సంఘీభావం ప్రకటించారు. 

రాజాసింగ్ గోషా మహల్ ఎం ఎల్ ఏ గా ఉండడంతో హైద్రాబాద్ లో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు సగానికిపైగా

తగ్గాయి అని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. 

ఏడాదిన్నర కాలం దాటుతున్నా రాజాసింగ్ పై వేటు రద్దు చేయక పోవడం తో లక్షలాది మంది రాజాసింగ్ అభిమానులు పార్టీ మారుతున్నట్టు ప్రకటించడం తో చేతగాని, చేవలేని గడ్డు పరిస్థితుల్లో బీజేపీ వేటు ను రద్దు చేసింది అనేది బహిర్గతం.. 

మైనారిటీ ఓట్ల కోసం బీజేపీ

చేసిన అత్యంత పెద్ద తప్పిదం సిట్టింగ్ ఎం ఎల్ ఏ  రాజాసింగ్ పై వేటు వెయ్యడం. హిందువులను దూషించిన వాళ్లకి బ్రహ్మరధం పడుతూ, వాళ్ళని అడ్డుకున్న వాళ్లకి జైలు శిక్ష విధించడాన్ని తప్పు పడుతూ అందరూ బీజేపీ అగ్రనేతలను తప్పు పట్టారు. 

ఇదే క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు చేయడం బీజేపీ చేతగాని తనం

బట్టబయలు అయ్యింది. దేశ చరిత్రలోనే సంచలనంగా మారి, అన్ని వర్గాల నాయకులను కలుపుకుంటూ వెళ్లిన బండి సంజయ్ కుమార్ ను తొలగించడం బీజేపీ చరిత్రనే ఘోరమైన తప్పిదం. ఘోరమైన వైఫల్యం చెందిన కిషన్ రెడ్డి కి పార్టీ పగ్గాలు ఇవ్వడం తో సీనియర్లు సైతం ఇతర పార్టీ లోకి గెంతుతున్నారు. ఇప్పడికే ఈటెల రాజేందర్, సహా అసంతృప్తి తో ఉన్న

నాయకులను బుజ్జగించడంతో అధిష్టానం దెబ్బతింది. 

సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లు నేరుగా ప్రచారం చేసినా, తెలంగాణాలో పెద్దగా బీజేపీ కి హావ కనపడక పోవడం గమనార్హం. బండి నాయకత్వం లో దాదాపుగా తెలంగాణ లో టి ఆర్ ఎస్ కు ముచ్చెమటలు పట్టించిన స్థాయి నుంచి, కిషన్ రెడ్డి నాయకత్వంలో రాగానే 115

స్థానాల్లో నిల్చునే అభ్యర్థులను వెతుక్కునే గతి పట్టింది. 

7 ముస్లిం ప్రాతినిధ్య ఎం ఎల్ ఏ స్థానాల మధ్యలో ఉన్న గోషా మహల్ ను హిందూ వర్గాల ప్రజల మద్దతు తో బీజేపీ ఖాతాలో వేసిన ఘనుడు రాజాసింగ్. వేటు ఎత్తక పొతే స్వతంత్ర అభ్యర్థిగా నిలుచునేందుకు సిద్ధంగా ఉండడంతో గతిలేక, రాజాసింగ్ పై వేటు ఎత్తివేస్తున్నట్టు

ప్రకటించింది. 

రాజాసింగ్ బీజేపీ లో ఉండడం బీజేపీ కె లాభం తప్ప, రాజాసింగ్ కు ఏమాత్రం లాభం కాదు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam