DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లలు స్మోకింగ్ జోలికి వెళ్లకుండా అవగాహన కల్పించాలి: ఆడారి కిషోర్ కుమార్

విశాఖ లో నో స్మోకింగ్ శిబిరం నిర్వహణ లో టీడీపీ యువ నేత వెల్లడి

(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)

విశాఖ పట్నం, అక్టోబర్ 22, 2023 (డి ఎన్ ఎస్): పిల్లలను అత్యంత ప్రమాదకరమైన స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల కు లోనూ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని తెలుగు దేశం యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్

అన్నారు. ఆది వారం విశాఖ నగరం లోనీ బీచ్ రోడ్ లో నిర్వహించిన నో స్మోకింగ్ డే అవగాహన శిబిరం లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్, మత్తు పదార్థాలు, బీడీ వంటి ధూమపానం వస్తువులు వాడడం ద్వారా కోట్లాది మంది గుండె, కాలేయం, ఊపిరి తిత్తుల చెడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఆదాయం

కోసం ఈ దుర్వ్యసనాలకు అనుమతి ఇచ్చి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి వ్యక్తి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్వచ్ఛ మైన ఉదజని పీల్చడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.  అప్పుడు మాత్రమే కుష్యం లేని గాలి దొరుకుతుందన్నారు.

స్మోకింగ్ , త్రాగుడు వంటి దుర్మార్గపు

లక్షణాల జోలికి వెళ్లకుండా తమ పిల్లలకు  ప్రతి తల్లి, తండ్రి అవగాహన కల్పించాలన్నారు. కన్సుమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ అవగాహన శిబిరం లో ఆ సంస్థ అధ్యక్షులు గొర్లే శ్రీనివాసులు నాయుడు,  ఎంపి జి వి ఎల్ నరసింహా రావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శిబిరంనికి మద్దతుగా  అతిథులు, ప్రజలు

స్వచ్ఛందంగా సంతకాలు చేశారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam