DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈనెల 29 న యలమంచిలిలో డెమోక్రసీ ఇన్ డేంజర్ 4 వ సదస్సు 

*ప్రజా చైతన్యం కోసమే ఈ రౌండ్ టేబుల్ సదస్సులు: ఆడారి కిషోర్ కుమార్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 28, 2023 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో ఏలుతున్న రాక్షస పాలనపై ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు డెమోక్రసీ ఇన్ డేంజర్ రౌండ్ టేబుల్ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం యువనాయకులు

ఆడారి కిషోర్ కుమార్ తెలియచేసారు. దీనిలో భాగంగా ఈనెల 29 న ఆదివారం అనకాపల్లి జిల్లా యలమంచిలి లోని టి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 

గత నాలుగున్నరేళ్లుగా రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి,  నిబంధనలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యం కూనీ చేస్తూ జరుగుతున్న పాలనపై ప్రతి

ఒక్కరూ స్పందించాలన్నారు. ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్వచ్చంద సంస్థలు అందరికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. 

త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి కోసం తాము ఎవరిని ఎన్నుకోవాలి తెలుసుకుని అత్యంత

జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది అన్నారు. 
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నోరెత్తి తమ అభిప్రాయం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేసిన పాలకులపై సర్వత్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో భావ ప్రకటన కోసం ఈ రౌండ్ టేబుల్ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 

యలమంచిలి లో జారితే ఈ 4 వ రౌండ్ టేబుల్ సమావేశంలో

నియోజక వర్గం ప్రాంత రాజకీయ పార్టీల నాయకులూ, కార్మిక సంఘాలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. వివరాలకు  ఫోన్ నెంబర్ 98850 68523 ను సంప్రదించాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam