DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొత్తవలస రైళ్ల ప్రమాద బాధితుల పరామర్శకు సీఎం జగన్ రాక 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 30, 2023 (డి ఎన్ ఎస్):* ఆదివారం రాత్రి విశాఖ దరి కొత్తవలస మండలం కంటకాపల్లిలో వద్ద జరిగిన రైలు ప్రమాదంలొ క్షతగాత్రులను పరామర్శించేందుకై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. ప్రత్యేక విమానంలో సోమవారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు విజయవాడ నుంచి

 విశాఖ అయన రానున్నారు. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు, పలాస ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీకొన్నాయి.  
ఈ రైల్ ప్రమాదంలో మొత్తం 49 మంది ప్రయాణికులు గాయాలు కాగా, 39 మంది విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పది మంది విశాఖ కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద తీవ్రత పై సిఎం జగన్ స్పందిస్తూ మృతుల

కుటుంబాలకు రూ. 10 లక్షలు క్షతగాత్రులకు 2 లక్షల రూపాయిలు, ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. 

రైల్ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు

:

1, ఎస్. హెచ్. ఎస్. రావు, రాయఘడ పాసింజర్ లోకో పైలట్. ఉత్తరప్రదేశ్.
2, గిరిజాల లక్ష్మి (35), ఎస్.పి. రామచంద్రాపురం, జి. సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా.
3, కంచు భారతి రవి (30), జోడుకొమ్ము (గ్రామం), జామి (మండలం), విజయనగరం జిల్లా.
4, చల్లా సతీష్ (32), ప్రదీప్ నగర్, విజయనగరం జిల్లా.
5, కరణం అక్కలనాయుడు (45), కాపు సంబాం (గ్రామం),

గరివిడి (మండలం), విజయనగరం జిల్లా.
6, విశాఖ పాసింజర్ రైలు గార్డు పేరు తెలియదు.
7, మరో మృతదేహాన్ని గుర్తించేందుకు బందువులు రావలసి వుంది.

ఆరు మృత దేహాలు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో వుండగా, ఒక మృత దేహం మిమ్స్ ఆసుపత్రి మార్చరీలో వుంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam