DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెం చెప్పమన్నదే నాక్ ముందు చెప్పాలి, స్టూడెంట్స్ కి ఎయు హుకుం ?

*నాక్ కమిటీ కోసం ఎయు లో అయ్యవార్ల ఆపసోపాలు, సర్కస్ ఫీట్లు* 

*వేరో చోట బీఈడీ చేసిన వాళ్ళ ని, ఆంగ్లం పై పట్టు ఉన్న వాళ్ళే ఎంపిక*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 31, 2023 (డి ఎన్ ఎస్):* మెం చెప్పమన్న విషయాలే నాక్ కమిటీ ముందు మీరు చెప్పాలి, అనే హెచ్చరిక వాక్యాలు ఆంధ్ర

యూనివర్సిటీ లో ఇప్పుడు మారుమ్రోగిపోతున్నాయి. త్వరలోనే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో పరిశీలనకు నేషనల్ ఎస్సెస్మెంట్ అక్రిడిటేడ్ కమిటి ( నాక్ )  రానున్న తరుణంలో గ్రేడింగ్ కోసం అన్ని విభాగాల సిబ్బందికి నిర్దిష్ట మైన సూచనలు వెళ్లినట్టు సమాచారం. 

ఏయు లోని ఏ విభాగం నుంచి కూడా లోపాలు, తప్పిదాలు కమిటీ కి కనపడడు

వీల్లేదు అనే హుకుం కూడా జారీ చేశారా అంటే అవుననే తెలుస్తోంది. 

కమిటీ మెప్పు కోసం ఎయు లోని అధికారులు, అయ్యవార్లు నానా ఆపసోపాలు పడుతున్నారు, సర్కస్ ఫీట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.  
 
దీనికి నిదర్శనంగా పలు విభాగాల్లోని విద్యార్థులను 50 మందిని ఎంపిక చేసి కమిటీ ముందు ప్రవేశ పెట్టనున్నారు. వీరు నాక్

కమిటీ తో సమావేశం కానున్నారు. యూనివర్సిటీ లో ఉన్న సదుపాయాలు, తదితర సమాచారం గురించి కమిటీ అడిగితె ఏం సమాధానం చెప్పాలో కూడా ఎయు అధికారులు విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. ఎయు లో అన్ని సదుపాయాలూ అంతర్జాతీయ స్థాయి లో ఉన్నాయని, అధ్యాపకులు మొదటి రోజు నుంచి ఏ ఒక్కరోజూ గైర్హాజరు కాలేదని, తరగతి గదులు విదేశీ సంస్థలకు

ధీటుగా ఉన్నాయని తదితర సమాధానాలు మాత్రమే చెప్పాలి అని ఆదేశిస్తున్నారు. 

కొన్ని విభాగాలు మరింత ఓవర్ ఆక్షన్ చేస్తూ. . . బయట విద్య సంస్థల్లో బీఈడీ  పూర్తి చేసి, ఎయు లో పిజి కోర్సులో చేరిన విద్యార్థులను ఎంపిక చేసి, వాళ్ళు బీఈడీ లో నేర్చుకున్న ట్రైనింగ్ విధానం ఎయు లోనే ఇచ్చినట్టుగా చెప్పాలి అనే హుకుం కూడా జారీ

చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

మీకు ఏ సమస్య ఉన్నా అది మెం పరిష్కారం చేస్తాం, కమిటీ ముందు మాత్రం తేడా రాకూడదు అని హెచ్చరిక పూర్వక సూచనలు కూడా అందించారు.

ఒక్కో విభాగంలోని విద్యార్థులను పరిశీలించి ఆంగ్లం లో అనర్గళం గా మాట్లాడే విద్యార్థులను, ఇంతకూ ముందే వేరే సంస్థల్లో బీఈడీ చేసిన వారిని,

కొంచెం హంగామా చేసే వారిని వెతికి మరీ ఎంపిక చేశారు. వారికి ప్రత్యేక సమాధాన పట్టిక ఇచ్చి సాధన చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

విద్యార్థులు తమ భవిష్యత్ అధికారుల చేతిలో ఉన్నందున, భయావహులై వాళ్ళు చెప్పిన ప్రతి అంశానికి తలూపుతున్నారు. మరో ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే తమ పిజి సర్టిఫికెట్ లు వచ్చేస్తాయి అనే

ఆలోచనతో నాక్ ముందు వీళ్ళు చెప్పే సమాధానాలే చెప్పేందుకు సిద్ద పడ్డారు. 

అయితే ఎయు లో లేని సదుపాయాలను ఉన్నట్టుగా చెప్పడం వల్ల, కేంద్రం నుంచి రావాల్సిన ఈ సదుపాయాలు వేరే సంస్థలకు వెళ్ళిపోతాయన్న భయం వీళ్లకు లేకపోవడం గమనార్హం. గతం లో ఎయు దేశంలోనే అత్యున్నత స్థాయి లో ఉండేది, పూర్తి స్థాయి లో రెగ్యులర్ టీచర్లు

ఉండేవారు, నేడు దాదాపుగా 80 శాతం తాత్కాలిక టీచర్లతోనే అన్ని విభాగాలు నెట్టుకొచ్చేస్తున్నాయి. వీళ్ళ ని పెర్మనెంట్ చెయ్యరు, కొత్త వారిని నియమించరు.  ఈ క్రమం లో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోతుంది.

కొన్నేళ్లుగా రంగులు వెలిసిపోయి, పాడుపడిన బిల్డింగ్ లతో సహా ఎయు లోని అన్ని భవనాలకూ కొత్త గా రంగులు

వేయించేస్తున్నారు. బిల్డింగ్ ల లోపల మరమత్తులు మాత్రం అలాగే ఉండడం గమనార్హం. 

కారణం ఏదైనా ఎయు లో అన్ని విభాగాల్లోని అధికారులు విభాగం పట్ల శద్ధ వహించడం, బిల్డింగ్ లకు పెయింటింగ్ లు వేయించడం, విద్యార్థులతో సమావేశాలు. .. క్రమం తప్పకుండా జరిపితే ఎయు కు పునర్వైభవం రావడం తధ్యం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam