DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఆడు మగాడ్రా బుజ్జి, ఒక్క జెండా పీకితే 10 వేలు పాతుతున్నాడు.*   

*తమిళ సింగం అన్నామలై మంత్రాంగంతో  ద్రవిడ నాట బీజేపీ ప్రభంజనం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం / చెన్నై , నవంబర్ 01, 2023 (డి ఎన్ ఎస్):* ఒక్క జండా పీకితే 10 వేల జండాలు పాతుతాం అని తమిళ సింగం అన్నామలై చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు వేసే

ఒక్కో అడుగు అధికార పార్టీ గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఎన్ మన్ - ఎన్ మక్కల్ పేరిట అన్నామలై చేస్తున్న పాదయాత్ర కు జన ప్రవాహం డీఎంకే నాయకులను పిచ్చెక్కేస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు. ఇప్పడికే డీఎంకే ఫైల్స్ పేరిట రెండు స్కాం లు విడుదల చేసి అన్నామలై భారతీయ రాజకీయ రంగం లో తనదైన ముద్ర వేసుకున్నారు. 
ఇతన్ని

ఎలా కట్టడి చెయ్యాలో తెలియక సతమతమవుతున్న డీఎంకే పార్టీ, అధికార యంత్రాగాన్ని, వందలాది పోలీసులని వినియోగించి అక్టోబర్ 21 అర్ధరాత్రి 1 గంట సమయంలో చెన్నై లోని అన్నామలై ఇంటి ముందు ఉన్న ఒక్క బీజేపీ జండా పోల్ ని పీకేసింది. ఈ సమయంలో అన్నామలై పాదయాత్రలో దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నాయకులూ  డీఎంకే దౌర్జన్యాన్ని

అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసారు. ఈ నేపధ్య్మలో వినయ్ భాస్కరన్ ఒక సామాన్య కార్యకర్త కళ్లపై పొలిసు లాఠీ పడడంతో కంటి కి తీవ్రమైన గాయం అయ్యింది. ప్రస్తుతం భాస్కరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

దీనిపై ఘాటుగా స్పందించిన అన్నామలై, డీఎంఏ ఒక్క బీజేపీ జండా పీకితే. . .తాము నవంబర్ 1 నుంచి ప్రతి రోజు 100

గ్రామాల్లో బీజేపీ జండాలు పాతుతామని, ఇలా 100 రోజుల మహా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆఖరి 10000 జండా పాటెందుకు వినయ్ భాస్కరన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తామన్నారు. ఒక సామాన్య కార్యకర్త కు గాయమైతే మొత్తం పార్టీ అంతా అండగా నిలబడే పార్టీ బీజేపీ ఒక్కటే నన్నారు. 
ప్రతి గ్రామం లోనూ జండా పాతే సమయంలో పోలీసులు, డీఎంకే

అడ్డుకుంటే. . బీజేపీ కి మరింత ప్రచారం అవుతుందన్నారు. దీనివల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అడ్డుకోకుంటే. . బీజేపీ పార్టీ 10 వేల  గ్రామాల్లో బలపడుతుందన్నారు. 
ఈ కార్యక్రమానికి నవంబర్ 1 న శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇంతటి మహోన్నత కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులను ఆహ్వానించడం ద్వారా తమ సొంతంగా గుర్తింపు

పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే అన్నామలై జనం నుంచి వచ్చిన, జనం మెచ్చిన నాయకుడు కావడంతో  ఈ ఉద్యమానికి కారణమైన సామాన్య కార్యకర్తను ముఖ్య అతిధిగా పిలుస్తున్నారు. 

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కి ఏమాత్రం గుర్తింపు లేకపోయినా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం లో అన్నామలై దాదాపుగా

కురుక్షేత్ర పోరాటమే చేస్తున్నారు. 

ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఒక్కడు ఉంటె చాలు. . .ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకులూ లేని కారణంగా బలమైన క్యాడర్, అభిమానులు ఉన్నా బీజేపీ పూర్తిగా చతికిల పది భూస్థాపితం దిశకు చేరుకుంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam